వైసీపీ హడావుడే కానీ విశాఖ వేదికపై ఉండేది బీజేపీ నేతలే !

ప్రధాని మోదీ బహిరంగసభ రాజకీయాలకు అతీతం అని వైసీపీ నేతలు ప్రకటించి.. కోట్ల కొద్దీ ప్రజాధనం వెచ్చించి ఆర్భాటంగా ఏర్పాట్లు చేయడమే కాదు.. చివరికి సొంత క్యాడర్‌కు ఖర్చు పెట్టి.. జన సమీకరణ చేస్తున్నారు. ఇంతా చేసి చివరికి వారికి అవమానమే మిగలబోతోంది. వేదికపై వైసీపీ నేతలెవరికీ చోటు దక్కడం లేదు. అందరూ బీజేపీ నేతలే ఉండనున్నారు. ప్రధాని సభ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్, సీఎం, స్థానిక లోక్‌సభ ఎంపీకి వేదికపై అవకాశం కల్పిస్తారు. ఆ ప్రకారం జగన్‌తో పాటు స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా వేదికపై ఉంటారు.

మొత్తంగా సభా వేదికపై తొమ్మిది మంది ఉంటారు. వారిలో ప్రధాని మోదీ , సీఎం , గవర్నర్, స్థానిక ఎంపీ కాకుండా మరో ఐదుగురికి చోటు దక్కింది. ఈ ఐదుగురు బీజేపీ నేతలే. ఒక్క వైసీపీ నేతకూ చాన్స్ దక్కలేదు. నెల్లూరు బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎంపీ జీవీల్ నరసింహారావు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణువ్, ఎంపీ సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌కు అవకాశం లభించింది. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి సభా నిర్వహణ చూసుకున్నారు. అయినప్పటికీ ఆయనకు వేదికపై చోటు లభించలేదు. యూపీ ఎంపీగా రికార్డుల్లో ఉన్న జీవీఎల్‌కు వేదికపై చోటు దక్కింది.

జీవీఎల్ నరసింహారావు ఇటీవలి కాలంలో విశాఖలో ఎక్కువగా కనిపిస్తున్నారు., వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మోదీ బహిరంగసభను బీజేపీ కన్నా వైఎస్ఆర్‌సీపీనే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద ఎత్తున జన సమీకరణకు సన్నాహాలు చేసుకుంది. అయితే చివరికి అది బీజేపీ సభగా మారిపోయింది. వేదికపై జగన్ మాట్లాడేది కూడా తక్కువే. వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నలభై నిమిషాలు ప్రసంగించనుండగా.. ముఖ్యమత్రి జగన్‌కు ఏడు నిమిషాలు కేటాయించారు. చూసి రెండు పేరాలు చదివేలోపు ఆ సమయం కాస్తా గడిచి పోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close