పాతపట్నం వైకాపా ఎమ్మెల్యే వికెట్ డౌన్

వైకాపా ప్రధాన కార్యాలయం లోటస్ పాండ్ లో మొన్న జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వారు వ్యక్తిగత పనులు కారణంగా రాలేకపోయారని కనుక వారు పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు చేయవద్దని వైకాపా సీనియర్ నేత ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాకి విజ్ఞప్తి చేసారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా, ఆ ఎమ్మెల్యేలకి పార్టీ మారే ఉద్దేశ్యమే లేకుంటే వారు తమ పార్టీ అధినేత నిర్వహిస్తున్న ముఖ్యమయిన ఆ సమావేశానికి ఎందుకు హాజరు కాలేకపోయారో మీడియా ముందుకు వచ్చి చెప్పి ఉండాలి లేదా మీడియాలో తమ గురించి వస్తున్న ఊహాగానాలను ఖండించి ఉండాలి. వారిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారు ఆ వార్తలను పట్టించుకోలేదు. అంటే ఆ ఊహాగానాలను దృవీకరిస్తున్నట్లే భావించవలసి ఉంటుంది.

జగన్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాని వారిలో శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ కూడా ఒకరు. తాజా సమాచారం ప్రకారం ఆయన తెదేపాలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని అందుకు మార్చి4వ తేదీకి ముహూర్తం కూడా పెట్టుకొన్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి హాజరుకాని వారిలో వైకాపా ఎమ్మెల్యేలు బలనాగి రెడ్డి (మంత్రాలయం), కె.సర్వేశ్వర రావు (అరుకు), సాయి ప్రసాద రెడ్డి (అధోని) కూడా ఉన్నారు. వారు కూడా మూటాముల్లె సర్దుకొంటున్నట్లు సమాచారం.

మార్చి 5నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఈసారి సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిశ్చయించుకొన్నారు. కానీ అంతకంటే ముందే చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు మీదే అవిశ్వాసం ప్రకటించేసి తెదేపాలో చేరిపోతున్నారు. ఈ పార్టీ ఫిరాయింపుల కారణంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్దమే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close