గాంధీ విగ్రహం వద్ద వైకాపా ఎమ్మెల్యేల ధర్నా

వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజాని హైకోర్టు ఆదేశించినా శాసనసభలోకి అనుమతించనందుకు నిరసనగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా వైకాపా ఎమ్మెల్యేలు అందరూ శాసనసభ ఆవరణలోని గాందీ విగ్రహం వద్ద ప్రస్తుతం ధర్నా చేస్తున్నారు. స్పీకర్ ఆదేశానుసారం రోజాను శాసనసభలోకి ప్రవేశించకుండా మార్షల్స్ అడ్డుకొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను తనకు చూపించమని లేకుంటే రోజాను సభలోకి వెళ్ళనివ్వాలని వాదించేరు. కానీ స్పీకర్ లిఖిత పూర్వకంగా తమకు ఆదేశాలు ఇవ్వలేదని కేవలం మౌకిక ఆదేశాలు మాత్రమే ఇచ్చేరని చెప్పారు. కొద్దిసేపు వారి మధ్య ఘర్షణ జరిగిన తరువాత వైకాపా సభ్యులు అందరూ గాందీ విగ్రహం వద్ద ధర్నాకి కూర్చొన్నారు. మరికొద్ది సేపటిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని గవర్నర్ నరసింహన్ న్ని కలిసి తెదేపా ప్రభుత్వంపై పిర్యాదు చేయబోతున్నారు.

ఈ పరిణామాలపై మంత్రి పీతల సుజాత స్పందిస్తూ “రోజా హైకోర్టుని తప్పుద్రోవ పట్టించి ఆ ఆదేశాలు తెచ్చుకొన్నారు. ఇంత జరిగినా ఆమెకు ఇంకా పొగరు తగ్గలేదు. ఆమెకు శాసనసభలో ప్రత్యక నియమ నిబంధనలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఆమె ఆకాశం నుంచి ఊడిపడలేదు. అందరూ కూడా స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే,” అని అన్నారు.

ఈ వ్యవహారంలో తెదేపా, వైకాపాలు రెండూ తప్పులు చేస్తూనే ఉన్నాయి. రోజాని శాసనసభలోకి మార్షల్స్ అనుమతించనపుడు, జగన్మోహన్ రెడ్డి వారితో వాదోపవాదాలు చేయడం చాలా తప్పు. వారు స్పీకర్ ఆదేశాలకు లోబడి తమ విధులు నిర్వరిస్తున్నారు తప్ప తమంతట తాముగా ఆ నిర్ణయం తీసుకోలేదని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. కనుక వారు అడ్డుకొన్నప్పుడు వారితో వాగ్వాదాలు చేసి తన స్థాయిని దిగజార్చుకొన్నట్లే అయ్యింది.

ఇంకా హైకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటించనవసరం ఉందా లేదా అనే న్యాయపరమయిన అంశాన్ని పక్కన బెట్టి ఆలోచిస్తే, రోజాను సభలోకి అనుమతించకుండా విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ కారణంగా న్యాయవ్యవస్థతో కూడా యుద్ధం చేయవలసివస్తే అది మరొక సమస్యగా తయారవుతుంది. పైగా తెదేపా ప్రభుత్వమే స్వయంగా రోజాకు మరింత ప్రచారం కల్పించినట్లవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close