వి.సా.రెడ్డికి ఈనాడు మీద కోపం కాదు..సాక్షి మీద అసంతృప్తే !

విజయసాయిరెడ్డి మీడియా చానల్ పెడతానని ప్రకటించారు. దానికి కారణంగా ఆయన రామోజీరావును చూపించారు. కానీ అదంతా నమ్మశక్యంగా లేదు. ప్రెస్ మీట్‌లోనే… చంద్రబాబును, టీడీపీని సాక్షి మీడియా అనుకున్నంత గట్టిగా తిట్టడం లేదని అందుకే తాను చానల్ పెడుతున్నానని చెప్పుకొచ్చారు. మైకుల ముందే విజయసాయిరెడ్డి ఇలా అనడంతో అసలు విషయం అదా అని.. జనానికి ఓ క్లారిటీ వచ్చింది. విజయసాయిరెడ్డికి.. వైసీపీ హైకమాండ్‌కు ఈ మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఆయనపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా వైసీపీ నేతలు స్పందించడం లేదు సరి కదా.. సాక్షి పత్రికలోనూ ఎలాంటి కౌంటర్లు రాలేదు.

దీంతో విజయసాయిరెడ్డి నొచ్చుకున్నారు. ఈనాడులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న వార్త వచ్చినా సాక్షి పేజీలకు పేజీలు కౌంటర్లు ఇస్తుంది. అందులో సంబంధం లేని అన్ని అంశాలను ప్రస్తావిస్తుంది. విజయసాయిరెడ్డి కూడా తనను సాక్షి మీడియా డిఫెండ్ చేస్తుందని మూడు రోజులపాటు ఎదురు చూశాడు. డిఫెండ్ చేయడానికి అవసరం అయిన సమాచారం అంతా సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్‌కు పంపారు.కానీ అటు వైపు నుంచి స్పందన లేదు. దీంతో మూడు రోజులు చూసి తానే మీడియా ముందుకు వచ్చారు. చివరికి తాను మీడియా చానల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇది ఈటీవీ కన్నా.. సాక్షికే పోటీ అయ్యే అవకాశాలున్నాయి.

టీవీ చానళ్లలో ఈటీవీ న్యూస్ ఎక్కడో ఉంటుంది. వెదికి పట్టుకోవాలి. నెంబర్ వన్‌..టు… ఇలా చాలా వరకూ చానళ్లు వైసీపీ అనుకూలమే. రామోజీపై పగ తీర్చుకోవాలనుకుంటే పత్రిక పెట్టాలి. ఎందుకంటే ఈనాడు నెంబర్ వన్‌ లో ఉంది. అయితే పోటీగా టీవీ చానల్ పెడతానని చెప్పడమే అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. సాక్షి ఎలాగూ తనను కాపాడదని.. తానే టీవీ చానల్ పెట్టుకోవాలని ఆయన డిసైడయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close