వైసీపీ సోషల్ మీడియా సైలెన్స్ – ఐ ప్యాక్‌ను వదిలించుకున్నారా ?

వైసీపీ సోషల్ మీడియా ఒక్క సారిగా మూగబోయింది. మామూుగా అయితే ఈ పాటికి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తో హడలెత్తించాలి. కానీ పోలింగ్ రోజు మధ్యాహ్నానికి చేసిన ఫేక్ సర్వే వీడియోల తర్వాత చప్పుడు లేకుండా పోయింది. పోలింగ్ సరళిపై ఎలాంటి అంచనాలు ఫేకులు రాలేదు. ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే తమకు తోచిన ట్వీట్లు పెడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా కూడా ఎఫెక్టివ్ గా లేకుండా పోయింది. దీనికి కారణం ఐ ప్యాక్ టీమ్ తో కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోడవమేనని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఐ ప్యాక్ ప్రశాంత్ కిషోర్ స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కార్యకాలాపాల్లో పీకే పాత్ర లేకపోయినప్పటికీ వాటా ఉంటుంది. రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయినా ప్రశాంత్ కిషోర్ తమకు వ్యతిరేకంగా పని చేయడంపై జగన్ ఫీలయ్యారని అంటున్నారు. మధ్యలో వదిలించుకోవడం ఇష్టం లేక పోలింగ్ అయిపోయే వరకూ పని చేయించుకున్నారని ఇక అసవరం లేదని ప్యాకప్ చెప్పేశారని అంటున్నారు. కనీసం కౌంటింగ్ వరకూ అవసరం లేదని.. సర్దుకోవాలని చెప్పేశారని అంటున్నారు.

మామూలుగా ఐ ప్యాక్.. పోలింగ్ తర్వాత వైసీపీకి హైప్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అలాంటి ప్రయత్నాలు జరగలేదు. కూలీ మీడియా సాయంతో కొంత హైప్ ఎక్కించుకుంటున్నారు కానీ.. సోషల్ మీడియా లో మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. ఎన్నికలకు ముందు ఎవైనా ఆన్ లైన్ పోల్స్ కనిపిస్తే.. బాట్స్ ను ఉపయోగించుకుని ఓటింగ్ అదరగొట్టేవారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేయకపోవడంతో ఐ ప్యాక్ ఇనాక్టివ్ అయిపోయిందన్న అభిప్రాయానికి వస్తున్నారు.

ఐ ప్యాక్ వల్ల గతంలో ఎంత లాభం జరిగిందో.. ఈ సారి అంత నష్టం జరిగిందన్న వాదన వైసీపీ వర్గాల్లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వాళ్లందర్నీ మళ్లీ సాక్షిలోకి తీసుకోవట్లేదు !

ఐదేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో సాక్షిలో పని చేసిన వాళ్లే ఎక్కువగా చేరారు. ఫోటో గ్రాఫర్ల దగ్గర నుంచి సలహాదారు, పీఆర్వోల వరకూ అందరూ సాక్షిలో...

ఏపీలో ఫ్రీ బస్సు స్కీమ్ పై కసరత్తు

ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీంపై అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఈ హామీని...

కొడాలి నాని ఇప్పుడు సుప్పిని..సుద్దపూస కూడా!

కొడాలి నాని నోరు తెరిస్తే లుచ్చా భాష మాట్లాడతారు. ప్రతి పదానికి ముందూ వెనుకా బూతులుంటాయి. ఇలాంటి భాష ఇప్పుడు మెరుగుపడింది. ఓడిన తర్వాత తొలి సారి మీడియా ముందుకు వచ్చిన ...

రైల్వే ట్రాఫిక్ రెడ్డి చేసిన భారీ లిక్కర్ స్కాం !

ఏపీలో జగన్మోహన్ రెడ్డి కేర్ టేకర్ సీఎంగా ఉండగానే ఆయన ప్రభుత్వంలోని అవినీతి పుట్ట బద్దలవుతోంది. ఐదేళ్ల పాటు మద్యం వ్యాపారాన్ని గుప్పిట పట్టిన వాసుదేవరెడ్డి అనే అధికారి ఫైళ్లు దొంగతనం చేసి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close