జగన్‌లో కాక పుట్టించిన రాహుల్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం నడుం బిగించారు. అనంతపురంజిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్, ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తానని చెప్పారు. కేంద్రం, చంద్రబాబు కళ్ళు తెరిపించేలా ఉద్యమం చేస్తామని అన్నారు. కేంద్రం దిగిరాకపోతే 67మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని చెప్పారు. ప్రత్యేకహోదాకోసం ఇప్పటికే నాలుగుసార్లు కేంద్ర హోం, ఆర్థికమంత్రులను కలిశానని, మంగళగిరిలో ఇదే అంశంపై రెండురోజుల దీక్షకూడా చేశానని అన్నారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా మొదట స్పందించేది తానేనని చెప్పారు.

రాహుల్ గాంధి ఇటీవలి అనంతపూర్ పర్యటన విజయవంతమవటం, ఏపీ కాంగ్రెస్ నాయకత్వంలో, శ్రేణులలో కొత్త ఉత్సాహం కలగటం తెలిసిందే. టీడీపీ, వైసీపీ పార్టీలు ఏపీకి ప్రత్యేకహోదాకోసం పోరాడటంలేదని, కేంద్రమంటే భయపడుతున్నాయని రాహుల్ ఆ పర్యటనలో ఆరోపించారు. ప్రత్యేకహోదాకోసం, పోలవరం ప్రాజెక్టుకోసం తాను పోరాడతాననికూడా రాహుల్ చెప్పారు. ఈ పరిణామాలు వైసీపీ నాయకత్వాన్ని ఆలోచింపచేసినట్లు కనబడుతోంది. ఇప్పటివరకు ఏపీలో టీడీపీకి ప్రత్యామ్నాయం తామేనని భావిస్తున్న ఆ పార్టీకి కాంగ్రెస్ బలం పెరిగితే తమకు నష్టం తప్పదని అర్థమవటంవలనే జగన్ ప్రత్యేకహోదాకోసం నడుం బిగించినట్లు ఒక వాదన వినబడుతోంది. ఉన్నట్లుండి ప్రత్యేకహోదాపై ఆందోళనకు దిగుతానని ప్రకటించటం, అదీ ఒక కార్యాచరణ ప్రణాళిక ఏమీలేకుండా హడావుడిగా ప్రకటన చేయటం ఆ వాదనకు బలంచేకూర్చేటట్లుగానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close