రైతులతో చర్చల కోసమా..? వారిలో చీలిక కోసమా..?

మూడు రాజధానులకు వరుసగా అడ్డంకులు ఏర్పడటం.. తప్పు మీద తప్పు చేసినట్లుగా పరిస్థితులు మారడంతో ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ అంశం తేలేవరకూ ఎటువంటి తరలింపు జరపొద్దని కోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై అన్వేషణ ప్రారంభించింది. ఈ సమయంలో రైతులతో చర్చలు, వారిని ఒప్పించటం మినహా వేరే గత్యంతరం లేదని ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు నిర్ణయానికి వచ్చారు. ఎలా ముందుకెళ్లాలన్నదానిపై.. చర్చలు జరిపారు. గురువారం… మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ చలమేశ్వర్, ఎంపీ లావు కృష్ణదేవరాయులు కలిసే సీఎం జగన్ ను కలిశారు. ఆ వెంటనే.. నర్సరావుపేట ఎంపీ.. రైతుల వద్దకు రాయబారానికి వచ్చారు.

రాజధాని రైతుల వద్దకు … కమిటీ ప్రతిపాదన తీసుకెళ్లే ఉద్దేశంతోనే… ఎంపీ లావు కృష్ణదేవరాయులను … పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనా.. ఢిల్లీ వెళ్లకుండా ఆపినట్లుగా తెలుస్తోంది. లావు కృష్ణదేవరాయులు శుక్రవారం రాజధానిలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో దీక్ష చేస్తున్న రైతుల వద్దకెళ్లారు. ప్రభుత్వం నుంచి త్వరలో ఒక కమిటీ వస్తుందని … మీ డిమాండ్లన్నీ ఈ కమిటీకి వివరించాలని సూచించారు. రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ తరపున ఓ నేత మొదటి సారిగా.. అమరావతి గ్రామాలకు వచ్చారు. అయినా.. రైతులెవరూ.. ఆయనను అడ్డుకోలేదు. ఆయన చెప్పిన మాటలను విన్నారు. అమరావతి తప్ప.. దేనికి అంగీకరించబోమని నిర్మోహమాటంగా చెప్పేశారు.

అయితే ప్రభుత్వ వ్యూహం అంతకు మించి ఉందన్న అభిప్రాయం… రైతుల్లో కలుగుతోంది. కొంతమంది వైసీపీ నేతల ద్వారా రైతు నేతలను తమ వద్దకు పిలిపించుకుని ప్రతిపాదనలను వివరించి ఉద్యమంలో చీలిక తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని జేఏసీ ఆనుమానిస్తోంది. ప్రభుత్వ వ్యూహాన్ని ముందే పసిగట్టిన జేఏసీ, ప్రతిపక్షాలు అమరావతి మినహా మరో ప్రతిపాదనను రైతులు అంగీకరించరని ముందే చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వ్యూహం ఏమిటో.. ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close