వైకాపా ఎంపీ కి “ఎల్లో ఫీవర్” : సాక్షి పేపర్ ఒకసారి చూడండి సార్

తమని ఎస్టీల్లో చేర్చాలంటూ శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద మత్స్యకారులు దీక్ష చేస్తున్నారు. వారికి సంఘీభావం పలకడానికి అక్కడికి వైకాపా ఎంపీ విజయ సాయి రెడ్డి వెళ్ళారు. సంఘీభావం మాట ఎలా ఉన్నా వారి వద్దకు వెళ్లిన విజయ సాయి రెడ్డి, దీక్ష చేస్తున్నవారిని చిన్నబుచ్చేలా మాట్లాడటమే కాక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విషయమేంటంటే అక్కడ దీక్ష చేస్తున్నవాళ్ళు ముద్రించిన కరపత్రం పసుపు రంగు లో ఉంది. అక్కడ ఉన్న పసుపు రంగు కరపత్రాన్ని చూసి తీవ్రంగా స్పందించారు. కాకతాళీయంగా ముద్రితమైన రంగు చూసి జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యమంత్రి మీకు మొండిచేయి చూపిస్తున్నా మీరు ఇంకా తెలుగుదేశం పార్టీ రంగునే ఎందుకు ఉపయోగిస్తున్నారంటూవారితో అన్నారు. ఆయన ఏమన్నాడో ఆయన మాటల్లోనే ..

“(వారి కర పత్రాన్ని చూపిస్తూ ) ఈ పేపర్ కలర్ కూడా తెలుగు దే శం కలరే. ఎందుకు మీరిలాంటి పని చేస్తున్నారో నాకైతే తెలీదు కానీ, తెలుగు దేశం రంగు మీరిలా ప్రింట్ చేసినంత మాత్రాన చంద్రబాబు మీకేమైనా న్యాయం చేస్తున్నారా? మీకు తెలీకుండానే మీరు తెలుగు దేశానికి సపోర్ట్ చేస్తున్నారు. మీకు మొండిచేయి చూపడమే కాక మీ తోలు తీస్తానని చంద్రబాబు అంటున్నారు. అయినా మీరు చంద్రబాబు ని సపోర్ట్ చేస్తూంటే, మిమ్మల్ని ఎవరు సేవ్ చేయగలరు చెప్పండి.”

అయితే కాకతాళీయంగా జరిగిన ఇంత చిన్నవిషయానికి ఎంపీ గారు అంత సీరియస్ అవడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఎల్లో కలర్ వాడిన వాళ్ళందరూ టిడిపి సపోర్టర్స్ అయిపోరు. ఆ మాటకి వస్తే ఎంపీ గారు తమ పార్టీ అధ్యక్షుడు నడుపుతున్న సాక్షి పేపర్ ని సరిగ్గా చూసారో లేదో మరి. సాక్షి దినపత్రిక మెయిన్ పేజీ లో సాక్షి అన్న పేరే (ఆయన దృష్టిలో ) టిడిపి రంగు అయిన “ఎల్లో కలర్ బ్యాక్ గ్రౌండ్” లో ఉంటుంది. మరి ఆ లెక్కన జగన్ గారు కూడా, మత్స్యకారుల్లాగే “తెలీకుండానే” టిడిపి కి అనుదినమూ తన పత్రిక ద్వారా మద్దతిస్తున్నట్టు ఎంపీ గారు భావిస్తున్నారా. అయితే ఆ రంగు మార్చే “క్లాస్” ఏదో ఆయన చెప్పాలింది మత్స్యకారులకి కాదు, సాక్షి ని నిర్వహిస్తున్న జగన్ గారికి.

సమస్య గురించి చర్చించకుండా ఈ కలర్స్ గొడవెందుకనేది ఎంపీ గారే ఆలోచించుకోవాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close