ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థులు అద్భుత రికార్డు నెలకొల్పారు.
ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేశారు. “యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్” థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఈ రికార్డు కోసం విద్యార్థులు కృషి చేశారు.
ఇంతకు ముందు ఇరవై వేల మంది విద్యార్థులతో ఏప్రిల్ 7, 2025న అరకు వ్యాలీలో జరిగింది, అక్కడ 20,000 విద్యార్థులు అందులో 13,000 వేల మంది బాలికలు రెండు గంటల్లో 108 సూర్యనమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఈ సారి 25,000 మంది విద్యార్థులు ఆ రికార్డును బ్రేక్ చేశారు. 12 ఆసనాలు శ్వాసతో సమన్వయంగా క్రమబద్ధంగా చేశారు. సూర్య నమస్కారంలో శ్వాసతో కూడిన ఈ కదలికలు ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సృష్టించడం అంత తేలిక కాదు. గిన్నిస్ రికార్డులో భాగం అయిన 25,000 మంది విద్యార్థులు రిజిస్టర్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరూ 12 ఆసనాల 108 రౌండ్లను సరిగ్గా చేయాల్సి ఉంటుంది. అన్నీసరిగ్గా చేశారు. గిన్నిస్ అధికారులు ధృవీకరణ కోసం వచ్చారు. రికార్డును శనివారం ప్రకటించనున్నారు.
ఈ రకార్డు సాధించిన విద్యార్థులను నారా లోకేష్ అభినందించారు. యోగాంధ్ర కు వస్తున్న ప్రధాని మోదీకి ఇది గిఫ్ట్ లాంటిదన్నారు.