సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని ఒప్పేసుకున్నట్లు అవుతుంది. స్పందిస్తే.. చెప్పే సమాధానాలతో ఎంత దారుణమైన అబద్దాలు ఆడుతున్నామో ప్రజలకు అర్థమవుతుంది. ఈ మీమాసంతోనే ఆయన సజ్జల ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టుతో ప్రెస్ మీట్ పెట్టారు.

పాత ఆరోపణలన్నీ మళ్లీ చేశారు కానీ.. కనీసం సునీత ఆధారాలు బయట పెట్టి చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. వాట్సాప్ కాల్స్ చాలా స్పష్టంగా ఉంటే.. తన నెంబర్ ఎన్నో వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుందని.. యాక్టివ్ గా ఉంటే.. తన పాత్ర ఉన్నట్లేనా అని ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించారు. కీలక సాక్ష్యంగా ఉన్న గూగుల్‌ టేక్‌ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోందని అవినాష్ రెడ్డి తేల్చేశారు. వైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుందని.. 100 మీటర్ల నుంచి కిలోమీటర్‌ అంత దూరం తేడా కనిపిస్తోందన్నారు. అది కూడా మూడేళ్ల తరువాత చూశారని లాజిక్ వివరించారు. మూడేళ్ల తర్వాత చూస్తే లోకేషన్ ఎక్కడో కనిపిస్తుందని.. తన ఇంట్లోనే చూపిస్తుందని ఆయన ఎందనుకుంటున్నారో మరి.

అసలు దర్యాప్తు ఎలా చేయాలో కూడా అవినాష్ రెడ్డి చెప్పారు. వాచ్ మెన్ రంగన్న స్టేట్ మెంట్ ఇచ్చారు కాబట్టి.. ఆ స్టేట్ మెంట్ లో ఉన్న నలుగుర్ని మందు అరెస్టు చేయాలట. దస్తగిరి హత్య చేశాడని ఒప్పుకున్నా.. సీబీఐ అధికారులు ఇంటికి పంపారని.. పక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు చెప్పుకొచ్చారు. హత్య జరిగిన తర్వాత జగన్ కు రాజకీయంగా ఇబ్బంది అవుతుందని.. సజ్జల స్టేట్ మెంట్లను ప్రెస్ మీట్లలో సునీతతో చదివించారు వైసీపీ నేతలు. ఇప్పుడు అవినాష్ అదే అసలు స్టేట్ మెంట్ అని వాదిస్తున్నారు.

అవినాష్ రెడ్డి వ్యవహారం నిండా మునిగిన తర్వాత చలేంటి అన్నట్లుగా ఉంది. తన తండ్రి 74 ఏళ్ల వయసులో జైల్లో ఉన్నారని.. అంటున్నారు. కానీ తండ్రిని జైలుకు పంపి.. తాను మాత్రం సీబీఐకి అడ్డుకుని మరీ హాయిగా బెయిల్ తెచ్చుకుని తిరిగేస్తున్నానన్నసంగతిని మాత్రం కన్వీనియంట్ గా మర్చిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close