“సిట్” విచారణ వివరాలు మీడియాకు చెప్పొద్దా..? అదేం పిటిషన్..?

వైఎస్ వివేకా హత్య కేసులో… వైఎస్ జగన్మోహన్ రెడ్డి… పడుతున్న కంగారు అంతా.. ఆయన కోర్టుల్లో దాఖలు చేస్తున్న పిటిషన్లలో బయట పడుతోంది. వివేకా హత్య విషయాన్ని పకడ్బందీగా గుండెపోటుగా.. మార్చాలనుకున్నా… చివరికి బయటపడిపోవడంతో.. మరుక్షణం.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, కడప నేత ఆదినారాయణరెడ్డిలపై ఆరోపణలు చేసేసి.. కవర్ చేసుకున్న వైసీపీ నేతలు… ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముందుకు సాగే కొద్దీ .. అంతకు అంత టెన్షన్ పడుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తే… ఏదో అయిపోతుందన్న ఫీలింగ్‌కి వచ్చి ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలంటూ.. కోర్టులకు వెళ్లారు. దీనిపై వాదనలు జరుగుతూండగానే.. జగన్మోహన్ రెడ్డి… సిట్ విచారణ వివరాలు మీడియాకు చెప్పకుండా.. ఆపాలంటూ… మరో పిటిషన్ వేశారు.

జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ చూసి.. న్యాయవర్గాలు నోరెళ‌్లబెట్టాల్సి వచ్చింది. ఓ నేరం జరిగినప్పుడు.. అది సంచలనాత్మకం అయినప్పుడు.. దానికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచాలని.. వివరాలు పోలీసులు బయట పెట్టకుండా చూడాలనే… పిటిషన్ ఇంత వరకూ… ఎవరూ దాఖలు చేసి ఉండని.. న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం… అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసన్నట్లుగా.. ఆ వివరాలు బయట పెడితే.. తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని… భావిస్తున్నట్లుగా ఉంది. అందుకే.. ఆయన మీడియాకు వివరాలను పోలింగ్ అయిపోయే వరకూ వెల్లడించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ హత్య కేసు దర్యాప్తునకు.. పోలింగ్‌కు సంబంధం ఏం ఉంటుంది..?

జగన్మోహన్ రెడ్డి పిటిషన్… న్యాయస్థానానికి కూడా వింతగా అనిపించినట్లుగా ఉంది. అందుకే.. ఆయన విజ్ఞప్తిని ధర్మాసనం అంగీకరంచలేదు. ఈ విషయంలో పోలీసులపై ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయడానికి నిరాకరించింది. నిజానికి… సిట్ దర్యాప్తు కీలక దశలో ఉంది. దాదాపుగా.. ఎవరు నిందితులు.. అన్నదానిపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. అత్యంత సున్నితమైన కేసు కాబట్టి.. ఎలాంటి అనుమానాలు రాకుండా.. సాంకేతిక ఆధారాలను కూడా.. బయటకు తీసి.. పక్కాగా బయట పెట్టాలనుకుంటున్నారు. ఎప్పుడు బయటకు వెల్లడిస్తారో ఇంకా స్పష్టం కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఎక్కువగా కంగారు పడిపోతున్నారు. ఈ కంగారు వెనుక ఉన్న అర్థం ఏమిటో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close