పథకాలపై “జగనన్న” ముద్రే..!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో.. అన్ని పథకాలకు వైఎస్ఆర్ పేరు పెట్టేవారు. పెన్షన్ల పథకానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని.. ఆరోగ్యశ్రీకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా అని పేర్లు పెట్టారు. చివరికి విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు.. అబ్దుల్ కలాం పేరు ఉంటే.. దాన్ని తీసేసి.. వైఎస్ఆర్ పేరు పెట్టాలనుకున్నారు. వివాదం అవడంతో.. అబ్దుల్ కలాం పేరే ఉంచారు.. అది వేరే విషయం. అయితే.. కొద్ది నెలలుగా.. వైఎస్ఆర్ పేరు ఏ పథకానికీ పెట్టడం లేదు. కానీ అనేక పథకాలు ప్రారంభమవుతున్నాయి. వాటన్నింటికీ… పేర్లు పెడుతున్నారు కానీ.. ఎక్కడా వైఎస్ ముద్ర కనిపించడం లేదు.

వైసీపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం దగ్గర్నుంచి ఈ ట్రెండ్ ప్రారంభమయింది. మొదట్లో అమ్మఒడి పథకానికి జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టేందుకు అంగీకరించలేదని.. మంత్రులందరం.. పట్టుబట్టి ఒప్పించామని.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. దానికి జగనన్న అమ్మ ఒడి అని పేరు పెట్టారు. ఆ తర్వాత ప్రారంభమవుతున్న ప్రతీ పథకానికి జగనన్న అనే పేరు కామన్ అయిపోయింది. చిన్న పిల్లలకు .. మధ్యాహ్న భోజనం పథకం ఎప్పటి నుంచో ఉంది. దానికి కొత్త మెనూ పెడుతున్నామని చెప్పి.. ఆ పేరును.. జగనన్న గోరుముద్ద అని పేరు మార్చేశారు. ఆ తర్వాత విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌పథకానికి జగనన్న విద్యా దీవెన… స్కాలర్ షిప్‌లు.. ఇచ్చేందుకు జగనన్న వసతి దీవెన అని పేర్లు పెట్టారు. ఇలా ప్రతి పథకానికి జగనన్న పేరు కామన్ అయిపోతూ వస్తోంది.

టీడీపీ హయాంలో… ఎక్కువ పథకాలకు ఎన్టీఆర్ పేర్లు పెట్టేవారు. అయితే.. చంద్రబాబు కూడా.. తర్వాత తన పేరును పథకాలకు జోడించుకోవడం ప్రారంభించారు. చంద్రన్న బీమా లాంటి పథకాలకు రూపకల్పన చేశారు. ఇప్పుడు అదే దారిలో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నారు. తనకంటూ.. కొన్ని ప్రత్యేకమైన సంక్షేమ పథకాల ఇమేజ్ రావాలని.. జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని.. అందు కోసమే… ఇలా పథకాలకు తన బ్రాండ్ వేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా… బయటకు వ్యక్తం చేసే పరిస్థితి మాత్రం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close