ఈ కార్య‌క్ర‌మాన్ని ‘ఓట‌ర్ల‌తో బేరం’ అనొచ్చేమో..!

‘రావాలి జ‌గ‌న్‌… కావాలి జ‌గ‌న్‌’… నేటి నుంచి 168 నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపా ప్రారంభిస్తున్న కార్య‌క్ర‌మం ఇది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర సాగుతున్న కొన్ని జిల్లాలు మిన‌హా… రాష్ట్రమంతా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టేందుకు వైకాపా శ్రేణులు సిద్ధ‌మౌతున్నాయి. బూత్ స్థాయిలో దీన్ని నిర్వ‌హిస్తారు. ప్ర‌తీ ఇంటికీ వెళ్లి, వైకాపా అధికారంలోకి వ‌స్తే క‌లిగే లాభాల‌ను వివ‌రిస్తారు. న‌వ‌ర‌త్నాల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌జ‌ల‌కు చెబుతారు. అవినీతి సొమ్ముతో పెద్ద ఎత్తున ఓట‌ర్లను కొనేందుకు టీడీపీ సిద్ధ‌మౌతున్న స‌మాచారం వైకాపా ద‌గ్గ‌ర ఉంద‌ట‌, అందుకే ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌వంతం చేయ‌డానికే ఈ కార్య‌క్ర‌మ‌మట‌!

సీఎం చంద్ర‌బాబు నాయుడు ఓటుకి రూ. 3 వేలు ఇస్తార‌నీ, అదే వైకాపా అధికారంలోకి వ‌స్తే జ‌రిగే మేలు అంత‌కంటే భారీగా ఉంటుంద‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మ ఉద్దేశంగా వైకాపా శ్రేణులు చెబుతున్నాయి! జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే రాష్ట్రంలో ప్ర‌తీ ఒక్క‌రికీ ఏడాదికి రూ. 1 ల‌క్ష నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ని ప్ర‌చారం చేస్తారు. రైతు భ‌రోసా కింద ఏడాదికి రూ. 12,500, ఉచిత క‌రెంట్, ఉచిత బోర్లు, ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్‌, అమ్మ ఒడి, పెన్ష‌న్లు… ఇలా ఎన్నో ప‌థ‌కాల ద్వారా వైకాపా అధికారంలో ఉండే ఐదేళ్ల‌లో గ‌రిష్టంగా రూ. 5 ల‌క్ష‌ల ప్ర‌యోజ‌నాలు ప్ర‌తీ ఒక్క‌రికీ ద‌క్కుతాయ‌న్న భ‌రోసా ‘రావాలి జ‌గ‌న్… కావాలి జ‌గ‌న్‌’ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌బోతున్నారు.

అంటే… ఓట‌ర్ల‌కు ఇలా డ‌బ్బుల లెక్క‌లు చెప్తారా..? ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం నుంచి వచ్చే డ‌బ్బులు కోసం మాత్ర‌మే చూస్తారా..? ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం అనేది ప్ర‌జ‌ల‌కూ రాజ‌కీయ పార్టీల మ‌ధ్య జ‌రిగే ఆర్థిక లావా దేవీలా క‌నిపిస్తోందా..? ప్ర‌జ‌ల‌ను వైకాపా చూస్తున్న దృష్టి కోణం అచ్చంగా ఇదే అన్న‌ట్టుగా ఉంది! మా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే రూ. ల‌క్ష నుంచి ఐదు ల‌క్ష‌ల ప్ర‌యోజ‌నం క‌లిస్తామ‌ని ప్ర‌చారం చేయ‌డాన్ని ఏమ‌నుకోవాలి..? ప‌్ర‌జా సంక్షేమం, భ‌ద్ర‌త‌, రాష్ట్ర భ‌విష్య‌త్తు, వెనుబ‌డిన ఆంధ్రా అభివృద్ధి, ప‌రిశ్ర‌మ‌లు, ఉద్యోగాల క‌ల్ప‌న‌, యువ‌త‌కు అవ‌కాశాలు.. ఇలాంటివే వైకాపాకి ప‌ట్ట‌వ‌న్న‌మాట‌! జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే చాలు అనే ఒక్క ల‌క్ష్యాన్ని మాత్ర‌మే ప్ర‌ధానంగా చేసుకుంటున్నారు. అంతేగానీ, త‌మ భ‌విష్య‌త్తుకు జ‌గ‌న్ నాయ‌క‌త్వం కావాల‌ని ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకునేలా ఆలోచింప‌జేసే కార్య‌క్ర‌మంగా ఇది క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు అయితే రూ. 3 వేలే ఇస్తారు, మేమైతే ఇదిగో ల‌క్ష‌లు ఇస్తామ‌న్న‌ట్టుగా ప్ర‌జ‌లకు చెప్పే ఈ కార్య‌క్ర‌మాన్ని అచ్చంగా ‘ఓట‌ర్ల‌తో బేరం’ అన‌డంలో త‌ప్పేముంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close