రోజూ షర్మిల రొటీన్ దీక్షలు !

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల రోజూ ఒకే ఎపిసోడ్ రిపీట్ చేస్తున్నారు. ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్లినప్పుడు జరిగిన పరిణామాలతో బోలెడంత మైలేజ్ వచ్చిందని అనుకున్నారేమో కానీ. . శుక్రవారం కూడా మళ్లీ అదే ప్లాన్ అమలు చేశారు. కానీ ప్రజలు పట్టించుకోలేదు. కానీ ఇదేం రాజకీయం అనుకోవడం కామన్ అయిపోయింది. తన పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం దగ్గర ఓ ఇరవై మందితో ధర్నాకు కూర్చున్నారు. పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని ఇంటి దగ్గర విడిచి పెట్టారు.

షర్మిల ఇంట్లోకి వెళ్లకుండా రోడ్డుపైనే కూర్చుని నిరసన చేపట్టారు. అంతగా దీక్ష చేయాలనుకుంటే.. ఇంట్లో టెంట్ వేసుకుని కూర్చుని చేయవచ్చు. రోడ్డుపై కూర్చుని చేయడంతో పోలీసులు మళ్లీ ఇంట్లోకి తరలించారు. అక్కడా సీన్ క్రియేట్ చేశారు. షర్మిలకు తోడు మళ్లీ విజయలక్ష్మి తెర మీదకు వస్తారు. ఆమె కూడా కారు డోర్ ఓపెన్ చేసుకుని కారులో కూర్చుని నిరసన తెలిపారు. ఇదంతా చూసే వాళ్లకు ఓ ప్రహసనంలా . . షర్మిల కావాలని చేసుకున్నట్లుగా ఉంటోంది కానీ.. ఆమెపై వేధింపులు జరుగుతున్నాయని అనుకునేలా లేదు.

ఏపీలో వారు చేసిన రాజకీయాలు అందరూ చూశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఇలాంటి రాజకీయాలే చేశారు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. అందుకే ప్రతీ దాన్ని స్క్రిప్టెడ్ అన్నట్లుగా చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. రోజూ ఒకటే స్క్రిప్ట్ సరిపోదని.. ప్లాన్ మార్చాలని అంటున్నారు వరంగల్ పోలీసులు పాదయాత్రుకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లాలి. షరతులకు లోబడి అనుమతి ఇవ్వాలని కోర్టు చెప్పింది. బీజేపీ నేత బండి సంజయ్ కూడా అదే చేశారు. కానీ షర్మిల మాత్రం రోడ్డుపై ధర్నాలు చేసి కొత్త రాజకీయం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తమ్మినేని సీతారాం LLB వివాదం !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాను పదవి చేపట్టిన తరవాత న్యాయపరిజ్ఞానం ఉండాలనుకుంటున్నారేమో కానీ ఎల్ఎల్‌బీ చదవాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఓ లా కాలేజీలో చేరారు. మూడేళ్లు దాటిపోయింది. కానీ ఆయన...

“లీక్‌” రాజకీయం – బీఆర్ఎస్‌ రాంగ్ స్టెప్ ?

టీఎస్‌పీఎస్సీ లీక్ వ్యవహారాన్ని రాజకీయ రంగు పులమడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు విషయాల కన్నా కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు సిట్ కేసులు పెట్టించే ప్రయత్నం...

బీజేపీ పెద్దల నుంచి కోమటిరెడ్డి కోరుతున్న హామీ ఏంటి !?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే బీజేపీ అగ్రనేతల్ని కలుస్తున్నారు. గడ్కరీ, అమిత్ షా, మోదీలను మార్చి మార్చి కలుస్తున్నారు. ఏమిటంటే తన నియోజకవర్గం పనుల కోసమని చెబుతున్నారు. ఏ బీజేపీ...

వైసీపీలో అనుమాన ముసలం !

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం వైసీపీలో చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తమకు సాంకేతికంగా ఉన్న 23 ఓట్ల వరకే టార్గెట్ పెట్టుకోవడంతో ఆ మేరకు క్రాస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close