షర్మిల 3 వేల కి.మీ నడక పూర్తి – ఎవరైనా పట్టించుకున్నారా?

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర మంచిర్యాల జిల్లాలో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. గత ఏడాది జూలై 8న షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. అ గత సంవత్సరం అక్టోబర్ 20న రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నుంచి ఆమె ఈ యాత్రను ప్రారంభించారు. తెలంగాణలోని హైదరాబాద్ మినహా అన్ని ఉమ్మడి జిల్లా మీదుగా షర్మిల యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికి మూడు వేల కిలోమీటర్లు అయింది. వెయ్యి..రెండు వేల కి.మీ మైలు రాయి దాటినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడూ అంతే.

ఎప్పట్లాగే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా విజయమ్మ వెళ్లారు. తన కుమార్తెకు ఒక్క చాన్స్ ఇవ్వాలన్నారు. రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగాన్ని తెలంగాణలో మళ్లీ తేవాలన్న ఉద్దేశంతోనే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిందని చెప్పుకొచ్చారు. యాత్ర ఆపాలని ఎన్నో కుట్రలు చేసినా..షర్మిల తలవంచలేదు..తలదించలేదన్నారు. సంకల్పంతోనే పాదయాత్ర చేస్తూ…ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటోందని చెప్పారు.

పాదయాత్రను ఎవరూ పట్టించుకోకపోవడంతో విపక్ష నేతలపై తిట్ల దండకం అందుకుంటున్నారు. వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే నన్ను చంపేస్తారా అంటూ డ్రామాలాడే ప్రయత్నంచేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటీకీ ప్రధాన రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు వినిపించడం లేదు. పార్టీ పెట్టిన తర్వాత రెండు సార్లు ఉపఎన్నికలు వచ్చాయి. హుజూరాబాద్‌లో పాటు మునుగోడు ఉపఎన్నికలు వచ్చినా.. షర్మిల పోటీ చేయలేదు. తమ బలం ఎంతో ప్రదర్శించాలని అనుకోలేదు. పార్టీలో షర్మిల తప్ప గుర్తుంచుకునే మరొక నేత లేకపోవడం కూడా మైనస్ అవుతోంది. షర్మిల కోసం ఆమె తల్లి పని చేస్తున్నారు. కానీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది అంచనా వేయడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !

జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు...

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close