ముందు జగన్, షర్మిలను కలుపు సజ్జల !

రెండు రాష్ట్రాలను కలపడానికే మా ఓటు అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నుంచి చాలా ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నేతలు… తెలంగాణ పార్టీలు విమర్శించడంలో ఓ అర్థం ఉంది.. కానీ అనూహ్యంగా.. షర్మిల నుంచి కూడా సజ్జలకు రివర్స్ ఎటాక్ ఎదురయింది. ముందు రాష్ట్రం గురించి.. రాష్ట్ర ప్రయోజనాల గురించి చూసుకోవాలని షర్మిల సలహా ఇచ్చారు.

వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని నేరుగా హెచ్చరికలు పంపారు. సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివన్నారు. నేడు తెలంగాణ ఒక వాస్తవం అని గుర్తు చేశారు. ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని.. రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యమని స్పష్టం చేశారు. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయని.. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద అని హితవు పలికారు. మీ హక్కుల కోసం పోరాటం చేయండి.. మీ ప్రాంతానికి న్యాయం చేయండన్నారు.

షర్మిల స్పందన చూసిన తర్వాత సోషల్ మీడియాలో సజ్జలపై చాలా సెటైర్లు పడుతున్నాయి. ముందు తెలుగు రాష్ట్రాలను కాదని.. జగన్, షర్మిలను కలపాలని ఆయనకు సూచిస్తున్నారు. అటు జగన్‌కు..ఇటు జగన్ ఫ్యామిలీ మధ్యలో సజ్జల అడ్డుగోడలా ఉన్నారని చాలా కాలంగా ఆరోపణలు వస్తన్నాయి. ఇప్పుడు ఈ విషయం లో ఆయనపై సెటైర్లు పడుతున్నాయి. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుహాస్‌కి ఇంత డిమాండా..?

చిన్న చిన్న సినిమాల్లో, చిన్న చిన్న పాత్ర‌ల‌తో ఎదిగాడు సుహాస్‌. యూ ట్యూబ్ నుంచి.. వెండి తెర‌కి ప్ర‌మోష‌న్ తెచ్చుకొన్నాడు. హీరో అయ్యాడు. క‌ల‌ర్ ఫొటోతో త‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ...

తమ్మినేని సీతారాం LLB వివాదం !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాను పదవి చేపట్టిన తరవాత న్యాయపరిజ్ఞానం ఉండాలనుకుంటున్నారేమో కానీ ఎల్ఎల్‌బీ చదవాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఓ లా కాలేజీలో చేరారు. మూడేళ్లు దాటిపోయింది. కానీ ఆయన...

“లీక్‌” రాజకీయం – బీఆర్ఎస్‌ రాంగ్ స్టెప్ ?

టీఎస్‌పీఎస్సీ లీక్ వ్యవహారాన్ని రాజకీయ రంగు పులమడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు విషయాల కన్నా కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు సిట్ కేసులు పెట్టించే ప్రయత్నం...

బీజేపీ పెద్దల నుంచి కోమటిరెడ్డి కోరుతున్న హామీ ఏంటి !?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే బీజేపీ అగ్రనేతల్ని కలుస్తున్నారు. గడ్కరీ, అమిత్ షా, మోదీలను మార్చి మార్చి కలుస్తున్నారు. ఏమిటంటే తన నియోజకవర్గం పనుల కోసమని చెబుతున్నారు. ఏ బీజేపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close