ఆ పొరపాటు మళ్ళీ చేయొద్దు: రోజా

వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా అభ్యర్ధి నల్లా సూర్యప్రకాష్ తరపున వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రచారం మొదలుపెట్టారు. ఆ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజి వరకు ఉచిత విద్య అందిస్తామని గొప్పలు చెప్పుకొంటారు. కానీ కనీసం స్కాలర్ షిప్పులు కూడా చెల్లించడం లేదు. కేసీఆర్ మాయ మాటలు నమ్మి అప్పుడు ఓటేస్తే వేసారు. కానీ ఈసారి మళ్ళీ అదే పొరపాటు చేయవద్దని వరంగల్ ప్రజలని కోరుతున్నాను. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఎల్లప్పుడూ పేద ప్రజల సంక్షేమం కోసం తపించేవారు. తెరాసకు తగిన గుణపాఠం చెప్పాలంటే వైకాపా అభ్యర్ధికే ఓటు వేయాలి,” అని అన్నారు.

కేజీ టు పీజి వరకు ఉచిత విద్య అందించే విషయంలో తెలంగాణా ప్రభుత్వం మాట తప్పిందా లేక దాని కోసం ఏర్పాట్లు చేయడానికి సమయం తీసుకొంటోందా? అనే విషయం పక్కనపెడితే, అదే ప్రభుత్వానికి పరోక్షంగా సహకరిస్తున్న వైకాపాకు ఎందుకు ఓటు వేయాలి? తెరాస ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశ్యంతో తెలంగాణా ప్రజల కోసం ఏనాడు పోరాడని వైకాపాకు ఎందుకు ఓటేయాలి? ఒకవేళ వైకాపా అభ్యర్ధిని గెలిపించినా ఆయనొక్కడివలన ఏమి సాధ్యమవుతుంది? వరంగల్ ప్రజలకు ఆయన ఏమి చేయగలరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వైకాపా ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తునపుడు, ఆ పార్టీ అభ్యర్ధిని గెలిపించి లోక్ సభకు పంపినా ఆయన మాటను కేంద్రం పట్టించుకొంటుందా? అసలు ఆయన జగన్ అనుమతి లేకుండా తెలంగాణా సమస్యల గురించి పార్లమెంటులో మాట్లాడే సాహసం చేయగలరా? అనే సందేహాలు కలుగకమానవు. బహుశః ఈ ప్రశ్నలకు వైకాపా వద్ద కూడా ఎటువంటి సమాధానాలు ఉండకపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close