వైకాపా ప్రత్యేక పోరు ఏ మలుపు తిరుగుతుందో?

ప్రత్యేక హోదా కోరుతూ జగన్ చేసిన నిరాహార దీక్ష ఎటువంటి ఫలితం లేకుండానే ముగియడంతో వైకాపా నేతలు అయోమయంలో పడ్డారు. ఎందుకంటే జగన్ చేత దీక్షను విరమింపజేసేందుకు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ఏదో ఒక హామీ ఇస్తుందని ఆశించిన వైకాపా నేతలకు వాటి స్పందన చూసి షాక్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, తెదేపా నేతలు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలతో ఎదురుదాడి చేయగా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జగన్ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారన్నట్లు మాట్లాడారు.

ప్రత్యేక హోదాపై గ్రామస్థాయి నుండి పోరాటం మొదలుపెట్టి, పరిస్థితులను, ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు అంచనా వేసుకొంటూ వాటిని బట్టి తమ పోరాటం ఉదృతం చేయడమో వెనక్కి తగ్గడమో చేసి ఉండి ఉంటే ఇటువంటి దుస్థితి ఎదురయ్యేది కాదు. కానీ జగన్ తొందరపాటు వలననో లేక ఆయనకి పార్టీలో సరయిన సలహా ఇచ్చేవాళ్ళు లేకనో, ఆయన ఎవరి సలహాలు సూచనలు తీసుకోకపోవడం చేతనో అకస్మాత్తుగా నిరాహార దీక్షకు కూర్చొని భంగపడ్డారు. ఇంతవరకు వచ్చిన తరువాత ఇప్పుడు వెనక్కి తగ్గాలంటే అందుకు చాలా బలమయిన కారణం కావాలి లేకుంటే నవ్వుల పాలవుతారు. అందుకే వైకాపా తన పోరాటాన్ని మళ్ళీ మొదటి నుండి కొనసాగించవలసి వస్తోంది.

అందులో భాగంగానే ఇవ్వాళ్ళ విజయవాడలోని పి.డబ్ల్యూ.డి. గ్రౌండ్స్ నుండి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వరకు వైకాపా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ర్యాలీ కార్యక్రమం పెట్టుకొన్నారు. కానీ దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వేలమంది ర్యాలీగా వెళ్లేందుకు ఏ రాష్ట్రంలోను పోలీసులు అనుమతించరనే సంగతి వైకాపా నేతలకి తెలియదనుకోలేము. అయినా వాళ్ళు భారీ ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొని వ్యానుల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. సహజంగానే వైకాపా నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా ర్యాలీ నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. బహుశః తెదేపా నేతలు కూడా అందుకు ధీటుగానే జవాబు చెప్పవచ్చును. అయితే వైకాపా మొదలుపెట్టిన ఈ పోరాటం చివరికి ఏమలుపు తిరుగబోతోంది? ఏవిధంగా ముగుస్తుంది? అసలు ప్రత్యేక హోదా సాధించగలదా లేదా? అనే ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close