వైసీపీకి ఓ లెక్కుంది… అది కాస్తా తప్పిందా..?

రాజకీయ పార్టీ అంటే ప్రజా సేవ చేసేది కాదు, అధికారం చెలాయించేది అనుకునే నాయకులు ఎక్కువగా ఉన్న రోజులివి. ఏం చేసైనా సరే అధికారంలోకి రావడమే ముఖ్యం. ఓట్ల కోసం ఎత్తులు జిత్తులు చాలా ముఖ్యమైపోయాయి. ఆధునిక కాలంలో వ్యూహాత్మక ఎత్తుగడలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. వైసీపీ ఏకైక లక్ష్యం జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం. అది తప్ప ఆ పార్టీకి మరేదీ కనిపించడం లేదు. ఏదైనా రంగంలో ఏపీ కాస్త మంచి ఫలితాలు సాధించిందంటే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షం కూడా సంతోషించాలి. కానీ అలాంటి ఆనవాయితీని కూడా వైసీపీ పాటించడం లేదు.

ఇప్పుడు కాపు ఓట్లపై కన్నేసింది. కాపు గర్జనకు, రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. సాక్షి మీడియా యథాశక్తి కాపు ఉద్యమానికి ఊతం ఇస్తోంది. తుని హింసాకాండకు జగన్ పార్టీయే కారణమని టీడీపీ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. దీన్ని వైసీపీ ఖండించింది. ఆ ఆరోపణ నిజమా కాదా అనేది విచారణలోనే బయటపడుతుంది. విధ్వంసం చేయించింది వైసీపీనా కాదా అనేది వేరే విషయం. కాపు ఉద్యమానికి అన్ని విధాలుగా అండగా నిలిచిన పార్టీ మాత్రం అదే అనేది ఏపీలో అందరికీ అర్థమైంది. ప్రస్తుతం బీసీల జాబితాలో ఉన్న వారికి కూడా అర్థమైంది.

కాపులకు మద్దతిస్తే 15 శాతం పైగా ఉన్న ఆ వర్గం ఓట్లు గంప గుత్తగా ఫ్యాన్ గుర్తుకు పడతాయనేది వైసీపీ లెక్క కావచ్చు. అదే నిజమైతే, ప్రస్తుత బీసీల ఓట్లు గంప గుత్తగా ఆ పార్టీకి దూరమైపోతే? దాదాపు 50 శాతం ఉన్న బీసీలు వైసీపీకి ఓటు వేయవద్దని నిర్ణయిస్తే సీన్ రివర్స్ అయిపోతుంది. కేవలం రెడ్డి, కాపు ఓట్లతో అధికారంలోకి రావడం కల్ల. సమాజంలో సగభాగం దాకా ఉండే బీసీలను దూరం చేసుకున్న ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. వైసీపీ ఎత్తుగడ వల్ల బీసీల్లో చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. కాపులను బీసీల్లో చేరిస్తే రిజర్వేషన్లలో తమ వాటా తగ్గిపోతుందని బీసీలు ఆందోళన చెందుతున్నారు. బీసీలకు అన్యాయం జరగకుండానే కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలనే ధోరణిలో వైసీపీ నాయకుడు మాట్లాడటం లేదు. అసలు బీసీల ఊసే ఎత్తకుండా కాపులను మాత్రమే దువ్వుతున్నారు.

ప్రెస్ మీట్లలో కూడా ఎంతసేపూ కాపులకు వత్తాసు పలకడం, టీడీపీని దుయ్యబట్టం, చంద్రబాబును తిట్టడం, తనకు పదవి ఎప్పుడెప్పుడు వస్తుందా అనే అసహనాన్ని ప్రదర్శించడం జగన్ కు అలవాటుగా మారింది. పదవి రాలేదనే అసహనం ఇంత బాహాటంగా వెళ్లగక్కే రాజకీయ నాయకులు చాలా చాలా అరుదు. జగన్ వ్యవహార శైలి, మాటలు గమనించిన వారికి, టీడీపీ ఆరోపణ నిజమేనేమో అనిపిస్తే అది మరీ ప్రమాదం. విధ్వంసాన్ని కూడా ఆయనే చేయించారనే ఆరోపణ చాలా తీవ్రమైంది. అది నిజం అనిపించేలా వైసీపీ నాయకులు, వారి మీడియా ప్రవర్తిస్తే బీసీలు ఇక ఆ పార్టీకి ఓటు వేయడం దుర్లభం.

అదే జరిగితే ఇప్పుడున్న సీట్లలో సగమైనా గెలవం కష్టం. 2019 కోసం ఇప్పటి నుంచే స్కెచ్ వేసిన వైసీపీ, కాపు ఓట్ల కోసం అత్యుత్సాహం తో పన్నిన వ్యూహం బెడిసికొడుతుందా? అలా ఏమీ జరగదని అనుకుందామంటే… మరి కాపులు, బీసీలు ఏకకాలంలో వైసీపీని నమ్మడం ఏ విధంగా సాధ్యం? బీసీలకు నష్టం జరగకుండా కాపులకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ సూటిగా, స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా జగన్ చెప్పడం లేదు. అదే వైసీపీకి నష్టం కలిగించ వచ్చంటున్నారు పరిశీలకులు. వైసీపీ తన ప్రస్థానంలో అనేక తప్పటడుగులు వేసింది. వాటికి మరొకటి చేరింది. 2019లో లాభం కంటే నష్టం ఎక్కువ తెచ్చిపెట్టే వ్యూహం, తమకు శాపంగా మారుతుందేమో అని కొందరు వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎత్తుగడ ఫలితం ఏమిటో తెలియాలంటే కొన్నేళ్లు వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close