వారధిపై ఆ “హెచ్చరిక ఫ్లెక్సీలు” ఎవరిని ఉద్దేశించి..!?

న్యాయమూర్తులు వెళ్లే దారిలో వైసీపీ నేతలు హెచ్చరికల ఫ్లెక్సీలు పెట్టడం దుమారం రేపుతోంది. తాడేపల్లి వారధిపై రెండు, మూడు రోజులుగా ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఎమ్మెల్యే జోగి రమేష్ ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. రాజ్యాంగ వ్యవస్థల పేరుతో ప్రభుత్వానికి సంకెళ్లు వేస్తే… చూస్తూ ఊరుకోబోమని ఆ ఫ్లెక్సీల్లో హెచ్చరికలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు బహిరంగంగా రాజ్యాంగ వ్యవస్థలను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా న్యాయవ్యవస్థ విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు నేపధ్యంలో వైసీపీ నేతలు ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అవుతోంది. పార్లమెంట్‌లో సైతం న్యాయవ్యవస్థను తప్పు పడుతూ ఆ పార్టీ ఎంపీలు మాట్లాడారు.

అదే సమయంలో బయట కూడా న్యాయవ్యవస్థపై అనుమానాలున్నాయని ప్రకటనలు చేశారు. ఇలాంటి తరుణంలో వైసీపీ నేతలు అత్యుత్సాహంగా పార్టీ పెద్దల మెప్పు పొందేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. సాధారణంగా ఇలాంటి వివాదాస్పద వ్యవహారాలు బయటకు తెలిసిన వెంటనే తీయించేస్తారు. కానీ ఈ ఫ్లెక్సీలు ఇప్పటికీ వారిధిపై కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో వైసీపీ పెద్దల అనుమతితోనే ఇవి పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

151 సీట్లు వచ్చాయంటే దానర్థం.. చట్టాలు. రాజ్యాంగాలను పట్టించుకోకుండా.. నియమాలను నిబంధనలు ఉల్లంఘించి అయినా ఏదైనా చేయవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. అవి న్యాయసమీక్షలో నిలవడం లేదు. అయితే ఉద్దేశపూర్వకంగానే న్యాయవ్యవస్థ తమ నిర్ణయాలను కొట్టి వేస్తోందని అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగి..అన్ని రకాలుగా న్యాయవ్యవస్థను టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close