సింగయ్య అనే దళిత వృద్ధుడ్ని జగన్మోహన్ రెడ్డి కారు బలి తీసుకుంది. వేగంగా వెళ్తున్న వాహనానికి ఆయన సడెన్గా అడ్డు రాలేదు. అనుమతి లేని రోడ్ షో చేస్తూ.. తరలించుకున్న నాలుగైదు వందల మందితో జేజేలు కొట్టించుకుంటూ చాలా పరిమిత వేగంగా తో వెళుతూ ఈ ప్రాణం తీశారు. ఈ ప్రమాదం చూసిన వారికి .. మనిషి ప్రాణం ఇంత తేలికగా.. సింపుల్గా తీసేయవచ్చా అన్న అనుమానం వస్తుంది. ఆ ప్రమాదం చేసిన వారిని.. చూస్తూ ఉన్నవారిని చూస్తే భయం వేస్తుంది.
ఆస్పత్రికి తీసుకెళ్లడం కనీసం మానవత్వం
ఏ వాహనం ఢీకొన్నా ముందు ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు అంటే.. ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేయడం ప్రాథమిక కర్తవ్యం. అంబులెన్స్కు ఫోన్ చేసి.. ఆస్పత్రికి తీసుకెళ్లి తక్షణ వైద్యం అందించి ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రమాదం చేసిన వారు తెలిసీ ఆ పని చేయకపోతే వారికి కఠిన శిక్షలు ఉంటాయి. ఇక్కడ జగన్ కారు కిందనే సింగయ్య పడినప్పటికీ తీసి డివైడర్ చెట్ల మధ్య పడేసి వెళ్లిపోయారు కానీ.. అయ్యోపాపం అనుకోలేదు. కారులో ఉన్న జగన్ రెడ్డికి ఇది తెలియదని అనుకోవడం .. జగన్ రెడ్డి ఘోరమైన వ్యక్తిత్వాన్ని సమర్థించడమే.
కేసవుతుందని తెలిసిన తర్వాతే పది లక్షల సాయం
ప్రమాదం జరిగిన రోజున.. వేరే కారు ఢీకొన్నదని పోలీసులు చెప్పారు. దాంతో ఇక తప్పించుకున్నామని అనుకున్న వైసీపీ నేతలు… బాధిత కుటుంబానికి ఎలాంటి సాయం చేయలేదు. ఆస్పత్రిలో పరామర్శించలేదు. రోడ్డు పక్కన పడేసి పోతే.. కొంత మంది అంబులెన్స్ ను పిలిపించి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన వెంటనే పిలిచి ఉన్నట్లయితే సింగయ్య బతికి ఉండేవారు. కానీ తీసుకెళ్లలేదు. పోలీసులు ఆ పని చేయాల్సి వచ్చింది. చనిపోయిన తర్వాత కేసు అవుతుందని.. పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటున్నారని తెలిసిన తర్వాత బాధితుల వద్దకు వెళ్లి అంబటి రాంబాబు పది లక్షల చెక్ ఇచ్చారు. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వకుండా చూసుకున్నాడు.
ఇలాంటి రాజకీయాలు చేస్తే ఎందుకు.. చేయకపోతే ఎందుకు ?
రాజకీయాలు అంటే మనుషుల కోసం చేసేవి. రోడ్డు మీద తమకు సంబంధం లేదని ప్రమాదం ఏదైనా జరిగితే.. కాన్వాయ్ లోని కార్లలో ఆస్పత్రికి పంపించే నేతల గురించి అప్పుడప్పుడూ చదువుతాం. అలాంటి పరిస్థితి నుంచి కాన్వాయ్ కారు చంపేసినా రోడ్డు పక్కన పడేసిపోయే ఘోరమైన మనస్థత్వమున్న నేతల రాజకీయాలు చూస్తున్నాం. ఇలాంటి వారికి జేజేలు కొడితే.. సింగయ్య లాంటి పరిస్థితే వస్తుంది.