కన్నా మళ్లీ చంద్రబాబుకు అమ్ముడు పోయారట..!

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు కౌంటర్ ఇచ్చే బాధ్యతను వైసీపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అప్పగించింది. ఆయన వైసీపీ స్టైల్లో… దూకుడైన ఆరోపణలు.. విమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. దేవుడి ఆస్తులపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నందున ఆరోపణలు కూడా ఆదే కోణంలో ఉంటున్నాయి. నూజివీడులో దేవుడి భూములు కన్నా కబ్జా చేశాడని ఆరోపణలు గుప్పించిన వెల్లంపల్లి..తాజాగా..చంద్రబాబుకు అమ్ముడుబోయారని ఆరోపణలు చేశారు. కొన్నాళ్ల కిందట.. కరోనా టెస్టింగ్ కిట్లలో అవినీతి గురించి కన్నా ప్రశ్నించినప్పుడు.. ఇలాంటి ఆరోపణలే విజయసాయిరెడ్డి చేశారు. ఇప్పుడు ఆలయ భూముల గురించి కన్నా ప్రశ్నిస్తూండటంతో.. మరోసారి వెల్లంపల్లిఅవే ఆరోపణలు చేస్తున్నారు.

పాస్టర్లు, ఇమామ్‌లకు హిందూ ఆలయాల సొమ్ము ఇస్తున్నారని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం దారుణమని వెల్లంపల్లి చెబుతున్నారు. తాము భూములు అమ్మకం ప్రక్రియను రద్దు చేసినా… బీజేపీ దొంగ దీక్షలు చేస్తోందని విమర్శించారు..దీనిపై.. కన్నా లక్ష్మినారాయణ వెంటనే కౌంటర్కౌంటర్ ఇచ్చారు. మంత్రి వెల్లంపల్లికి జీవో రద్దు, నిలుపుదల మధ్య తేడా కూడా తెలియదని విమర్శించారు. చాక్లెట్ ఇచ్చి నెక్లస్‌ ఎత్తుకెళ్లినట్టుగా నవరత్నాల వ్యవహారం ఉందని..ఏడాదిలోనే ప్రభుత్వ ఆస్తులు అమ్మే స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారుని.. టీటీడీ ఆస్తుల అమ్మకం జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర బీజేపీ నేతలతో పోలిస్తే..కన్నా లక్ష్మినారాయణ ప్రభుత్వంపై అగ్రెసివ్‌గా వెళ్తున్నారు.

చాలా మంది నేతలు… ఆలయ భూముల అమ్మకంపై ప్రభుత్వం వెనక్కి తగ్గిన తర్వాత.. సైలెంటయిపోయారు. కానీ కన్నా మాత్రం… ప్రభుత్వం మోసం చేస్తోందని కొత్త ఆరోపణలతో దీక్ష ప్రారంభించారు. దీంతో వైసీపీ నేతలు.. కన్నాను మరోసారి అమ్ముడుపోయారనే దిశగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. కొసమెరుపేమిటంటే…త్వరలో కన్నాను.. బీజేపీ చీఫ్ పోస్టు నుంచి తప్పించబోతున్నారని..వైసీపీ నేతలే ప్రచారం చేస్తూ….తమకు అనుకూలంగా ఉండే.. బీజేపీ ఏపీ చీఫ్ రాబోతున్నాడని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close