చంద్రబాబు ఇంటిపై వైసీపీ రాళ్ల దాడి ..ఉండవల్లిలో టెన్షన్ టెన్షన్

అయ్యన్నపాత్రుడు జగన్‌ను తిట్టారని చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు ఇంటి ముట్టడికి రావడం కలకలం రేపింది. ఉదయమే పెద్దగా సెక్యూరిటీ లేని సమయంలో నేరుగా చంద్రబాబు ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నారు. వారిని పోలీసులు కూడా అడ్డుకోలేదు. వీరు ఇలా ముట్టడించారని తెలిసి వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో జోగిరమేష్ వాగ్వాదం పెట్టున్నారు. కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. చంద్రబాబు ఇంటిపై రాళ్లు రువ్వారు.

వైసీపీ కార్యకర్తలు రాళ్లు వేస్తున్నా.. కర్రలతో దాడి చేస్తున్నా పోలీసులు అడ్డుకోలేదు. జోగి రమేష్ స్వయంగా పార్టీ కార్యకర్తలను తీసుకుని చంద్రబాబు ఇంటికి వచ్చారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చామని టీడీపీ నేతలు తమపై దాడి చేశారని జోగి రమేష్ ఆరోపించారు . తన కారును టీడీపీ నేతలు పగుల గొట్టారని ఆరోపించారు. చంద్రబాబు తనపై గూండాలతో దాడి చేయించారని ఆరోపించారు. అదే సమయంలో చంద్రబాబుపై తిట్ల దండకం వినిపించారు. ఇంట్లో పడుకోవడం కాదు దమ్ముంటే బయటకు వస్తే తేల్చుకుందామని సవాల్ చేశారు. చంద్రబాబు, ఆయన కొడుకు సంగతి చూస్తామన్నారు.

ముందుగా ఉండవల్లి చంద్రబాబు నివాసం వద్దకు వైసీపీ కార్యకర్తలు రాకుండా నిలువరించడంలో విఫలమైన పోలీసులు ఆ తర్వాత కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండిపోయారు. ఘర్షణలు ప్రారంభమైన తర్వాత తప్పనిసరి అన్నట్లుగా వైసీపీ కార్యకర్తలను అక్కడ్నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. జడ్ ప్లస్ కేటగిరి ఉన్న మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఇంటికి అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున అనుచరులతో కర్రలతో వెళ్తూంటే పోలీసులు కనీసం అడ్డుకోకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ప్రతిపక్ష నేతకు భద్రత లేదా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్థాన్‌లా మార్చారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తాలిబన్లను మించిపోయారన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో, హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close