కాంగ్రెస్‌కు ఫుల్ టైం వర్క్ చేస్తున్న వైసీపీ ఎంపీ !

ప్రజలు రాష్ట్రానికి మేలు చేస్తారని ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. వారి ఓట్లతో రాజ్యసభ సభ్యులను మాత్రం ఇతర రాష్ట్రాల వారిని ఎంపిక చేశారు జగన్ రెడ్డి. పరిమళ్ నత్వానీ ఏపీకి మరోసారి రాలేదు. నిరంజన్ రెడ్డి జగన్ రెడ్డి కేసుల కోసం హైకోర్టు,, సుప్రీంకోర్టు మధ్య తిరుగుతూంటారు. ఆయన ఏపీకి రారు. వచ్చినా జగన్ కేసుల కోసమే. మరో ఎంపీ కృష్ణయ్య.. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసిపోయి రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు బీసీలకు వ్యతిరేకమని ఆయన చురుగ్గా ప్రకటనలు చేయడమే కాదు.. ఆ పార్టీలకు వ్యతిరేకంగా కొన్ని చర్యలు చేపడుతున్నారు.

బీసీ సంక్షేమ సంఘం పేరుతో సంఘాన్ని పెట్టుకుని చాలా కాలంగా రాజకీయ పలుకుబడి పెంచుకున్న ఆయన … చాలా అవకాశాలు పొందారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీలో చేరి… ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత మళ్లీ టిక్కెట్ రాదని తెలియడంతో అన్ని పార్టీల్లో టిక్కెట్ కోసం తిరిగారు. చివరికి కాంగ్రెస్ లో చేరి మిర్యాలగూడ నుంచి పోటీ చేశారు. ఘోరపరాజయం ఎదురు కావడంతో ఆయన తర్వాత కాంగ్రెస్ కు వ్యతిరేకమయ్యారు. కేసీఆర్ ను పొగుడుతూ తిరిగారు. ఎలా పట్టారో కానీ వైసీపీ నుంచి రాజ్యసభ సీటు తెచ్చుకున్నారు.

ఇప్పుడు మళ్లీ ఆయన కాంగ్రెస్ కు పని చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. బీసీలకు అనుకూలంగా కాంగ్రెస్ ఉందన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా ధర్నాలకూ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆయనను కంట్రోల్ చేయడానికి వేసీపీ ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. ఆయన తమ పార్టీ ఎంపీ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close