ఉద్యోగులందరూ లంచగొండులేనా ? వైసీపీ ప్రచారం వర్కవుట్ అవుతుందా?

ఎన్నికలకు ముందు ఉద్యోగులంటే ఎంతో ప్రేమ చూపించిన వైసీపీ అధినేత జగన్, ఆ ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఉద్యోగుల్ని లంచగొండులుగా… విధులు నిర్వహించకుండా వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వారిగా చిత్రీకరిస్తున్నారు. ఇక ప్రభుత్వం అయితే వారికి జీతాలు తగ్గించడం లేదని పేజీలకు పేజీలు తమ వాదన రాసి ప్రజల వద్దకు తీసుకెళ్తోంది. ఆదాయం తగ్గిపోయిందని.. అయినా ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని చెబుతోంది. ఇప్పుడు అటు ప్రభుత్వం.. ఇటు వైసీపీ చేస్తున్న ప్రచారం భిన్న చర్చకు కారణం అవుతోంది.

టీచర్లు ఇటీవల ఓ రోజు కలెక్టరేట్లను ముట్టడించారు. ఆ తర్వాత టీచర్లందరిపైనా వరుస పెట్టి దాడి జరిగింది. ఎవరూ పాఠాలు చెప్పరని ఒకరు.. వారికి పాఠాలు చెప్పడం రాదని మరొకరు సోషల్ మీడియాలో ఎటాక్ ప్రారంభించారు. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుని వడ్డీ వ్యాపారం.. రియల్ ఎస్టేట్ చేసుకుంటూ టైం పాస్ చేస్తారని.. వారే బాగుండే ప్రభుత్వ స్కూళ్లు ఇలా ఎందుకు ఉంటాయని ప్రశ్నించడం ప్రారంభించారు . టీచర్లకు లంచాలు రావు కాబట్టి వైసీపీ నేతలు ఈ ప్రచార వ్యూహాన్ని అవలభించినట్లుగా తెలుస్తోంది.

ఇక ఇతర ఉద్యోగులపై లంచగొండి ముద్ర వేస్తున్నారు. లంచం లేకుండా ప్రభుత్వాఫీసుల్లో ఏ పని చేయరని.. అలాంటి వారికి మద్దతిచ్చేదేదమిటని ప్రజలను రెచ్చగొడుతున్నారు . ఉద్యోగులపై ప్రజల్లో ఉండే సహజ సిద్ధ వ్యతిరేకతను మరింత రెచ్చగొట్టి వారికి మద్దతు రాకుండా చేయాల్సినంత ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా తమ వాదన తాము వినిపిస్తున్నారు. అయితే పని చేయరని.. లేపోతే లంచగొండులని ముద్ర వేసి.. ప్రజల్లో ఉద్యోగులపై వ్యతిరేకత పెంచడానికి .. ఇతర రాజకీయ పార్టీలపై వైసీపీ ఎలాంటి వ్యూహం పన్నిందో.. అలాంటిదే అమలు చేస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జగన్ ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారో వారికీ అర్థం కావడం లేదు. స్థానిక ఎన్నికల సమయంలో ప్రదర్శించిన స్వామిభక్తికి మెచ్చి ఎంతో కొంత మేలు చేస్తారనుకుంటే మొత్తానికే మోసం చేస్తున్నారని రగిలిపోతున్నారు. ఇప్పుడు బోనస్‌గా తమపై ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూండటంతో వారికి ఆగ్రహం మరింత పెరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close