వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి రాజకీయ బలం ఏమిటి ?. గంజాయి గాళ్లు, రౌడీలు, ఆవారాగాళ్లు, జీవితంపై లక్ష్యం లేని వాళ్లు.. వీరికి తోడు.. కులం,మతం పేరుతో రెచ్చగొట్టే కొంత మంది నిరుపేదలు. వీరిని ఉపయోగించుకుని జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. వారి జీవితాలు బాగుపడితే మళ్లీ తన వైపు చూడరని వారిని ఆ స్థాయిలోనే ఉంచుతారు. ఉన్మాదంలో ముంచెత్తుతారు.
జగన్ చుట్టూ చేరే సైకోలే సాక్ష్యం !
తాడేపల్లి నుంచి జగన్ రెడ్డి సత్తెనపల్లి బయలుదేరాదాకా మధ్యలో కొన్ని చోట్ల జనాలను సమీకరించారు. సింగయ్యను తొక్కి చంపేసిన దగ్గర జగన్ కారు ఎడమవైపు డోర్ తీసి జగన్ దండాలు పెడుతున్నారు. అదే కారుతో అపుడే సింగయ్యను తొక్కించి చంపేశారు. అలా చంపుతున్నప్పుడే ఓ యువకుడు ఉన్మాదంతో కారు మీద కు ఎక్కి బోనెట్ మీద ఒక బక్కపలచని కుర్రవాడు తెలియని ఆనందంతో ఊగిపోతున్నాడు. జగన్ బయటకు వెళ్తే ఆయన చుట్టూ ఇలాంటి కుర్రవాళ్లే కనబడుతారు. వీరంతా లంపెన్లు.
నిరుపేద యువకుల్ని లంపెన్లుగా చేస్తున్న జగన్
ఆర్థికంగా స్థిరత్వం లేని వారు.. పనులు చేయడానికి బద్దకించేవారు, కుటుంబ బాధ్యతలు లేని వారు.. ఉన్నా పట్టించుకోని వారు, తాగుడు, గంజాయిలకు అలవాటు పడిన వారిని “లంపెన్లు” అంటారు. పేదల్ని చాలా మంది పైకి రావాలని కృషి చేస్తూ ఉంటారు. అలాంటి వారు చైతన్యవంతంగా ఉంటారు. కానీ దారి తప్పిన యువతను లంపెన్లుగా మార్చుకుని రాజకీయం చేస్తున్నారు. ఆవేశం, ఉద్రేకం, నేరాలను స్వభావాలుగా వున్న లంపెన్లు చిల్లర నేరాల్లో పోలీస్ స్టేషన్ల వద్ద కనబడుతూ వుంటారు.
వీళ్ళని లోకల్ నాయకులు వారి వారి పార్టీల పెద్ద నాయకుల ద్వారా బయటికి తీసుకువస్తూ వుంటారు. ఈ విధంగా చిన్న నేరాలు చేసే లంపెన్లు రాజకీయ అనుబంధాలు ఏర్పడుతూ వుంటాయి. ఇలాంటి వారిని జగన్ తన పార్టీకి కార్యకర్తలుగా మార్చుకుంటున్నారు.
లంపెన్ల చైన్ ఏర్పాటు చేసుకున్న జగన్
అధికార పార్టీకే కాక అన్ని పార్టీల్లోనూ ఎక్కువ, తక్కువలతో ఈ లంపెన్ల గ్యాంగ్ ఉంటారు. అయితే జగన్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో లంపెన్లతో రాష్ట్రవ్యాప్తంగా ఒక చైన్ ఏర్పడిందని సీనియర్ జర్నలిస్టు ఒకరు సోషల్ మీడియాలో విశ్లేషించారు. గంజాయి రవాణా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మారింది. ఈ చైన్లలో పైకి కనిపించేది లుంపెన్లు. తెరవెనుక వున్నది చిన్నా పెద్దా నాయకులు. లిక్కర్ వ్యాపారంలో షాపుల వద్ద ఎక్కడికక్కడ హంగూ ఆర్భాటాలతో నిలబడింది కూడా లంపెన్లేనని చెప్పాల్సిన పని లేదు.
ప్రజాసమస్యల ప్రస్తావన ఎక్కడైనా ఉందా ?
జగన్ కు తనమీదే తప్ప ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఓదార్పు యాత్రల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సజీవంగా వుంచాలని ఆయన భావిస్తున్నారు. ఈ యాత్రల్లో ప్రజా సమస్యల ప్రస్తావన వుండదు. ఈ యాత్రల్లో చంద్రబాబు మీద విమర్శలు మాత్రమే వుంటాయి. కాసేపు హంగామా సృష్టించడానికి లుంపెన్లు వుంటారు.
పార్టీ పెట్టినప్పుడు కూడా జగన్ ప్రజల ముందుకి రావడానికి జగన్ ఓదార్పు యాత్రలనే సాధనంగా ఎంచుకున్నారు. డ్రామాలకు.. లంపెన్లు సరిపోతారు . ఈ లంపెన్ల వ్యవహారంతో మరోసారి రాజకీయం చేసి.. ప్రజల్ని తొక్కిపడేద్దామని.. జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ లంపెన్లకు చిన్నపాటి అధికారం దక్కినా ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు .