ముద్రగడ పద్మనాభం కుటుంబంలో ఏర్పడిన వివాదాలతో వైసీపీ రాజకీయ ఆట ఆడుతూ వారి కుటుంబం పూర్తిగా చీలిపోయేలా చేస్తోంది. రాజకీయానికి సంబంధం లేకుండా తన తండ్రికి చికిత్స విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయన కుమార్తె క్రాంతి ట్వీట్ పెడితే.. దానికి కౌంటర్ గా నాలుగు రోజుల తర్వాత ఓ లేఖ రిలీజ్ చేయించారు. ఇది పూర్తిగా రాజకీయ ఆరోపణలతో ఉంది. అంటే వైసీపీ నాయకులు ఎలా ఈ లేఖను రాయించారో అర్థం చేసుకోవచ్చు.
ముద్రగడ పద్మనాభం కూడా బయటకు వచ్చి .. లేఖలోని అంశాలను చెప్పారు. దీంతో సాక్షి మీడియా పండగ చేసుకుంటోంది. ఇందులో ఆయన తన కుమారుడు రాజకీయ ఎదుగుదలను చూడలేక కుట్రలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. తన వియ్యంకుడితో వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన భార్యకు అనారోగ్యం వచ్చినప్పుడు కుమార్తె ఇంటికి వెళ్తే పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
ఈ కుటుంబ వివాదాలకు సూపర్ సిక్స్ హామీైలకు ఏమి సంబంధమో కానీ లేఖలో ఈ విషయాలను చెప్పించారు. తన కుమారుడినే కాదు.. తన మనవడికీ రాజకీయ జీవితం ఇస్తానని.. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. ఎవరైనా కుమార్తె తో జరిగిన వివాదాలను.. రాజకీయానికి ముడి పెట్టకుండా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ఇలా రాజకీయంగా స్పందిస్తారా?. కాస్త తెలివి ఉన్న తండ్రి ఎవరైనా స్పందించే అవకాశం ఉండదు. ముద్రగడ కుటుంబంతో వైసీపీ ఆడుతున్న రాజకీయ నాటకమే ఇదని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రాజకీయాల వల్ల ముద్రగడ కుటుంబం మళ్లీ కులుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు.