పల్నాడు టెన్షన్..! చంద్రబాబు డిమాండ్‌కు జగన్ సర్కార్ ఓకే..!

చంద్రబాబు డిమాండ్ కు ప్రభుత్వం స్పందించింది. మొదట్లో బెట్టు చేసినా.. చివరికి ఓకే అంది. వైసీపీ కార్యకర్తల దాడులకు గురైన టీడీపీ కార్యకర్తలను వారి వారి గ్రామాలకు తీసుకెళ్లి వదిలి పెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పల్నాడులో అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని.. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాని… తెలుగుదేశం పార్టీ కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. దాడులకు గురై… గ్రామల్లో ఉండలేక… వచ్చేసిన వారి కోసం.. తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఓ శిబిరం ఏర్పాటు చేసింది. ఆ శిబిరంలో ఉన్న వారిని పోలీసులు పరామర్శించి… వారి గ్రామాలకు తీసుకెళ్లి… వారి రోజువారీ జీవితాన్ని శాంతియుతంగా గడిపేలా భరోసా ఇవ్వాలని .. శిబిరం ఏర్పాటు చేసిన రోజున చంద్రబాబు డిమాండ్ చేశారు. లేకపోతే.. తానే వారిని గ్రామాలకు తీసుకెళ్లి విడిచి పెడతానని ప్రకటించారు. అయితే.. వైసీపీ దాడులకు గురైన వారి గురించి పోలీసులు , ప్రభుత్వం లైట్ తీసుకుంది.

పోటీగా… టీడీపీ హయాంలో దాడులకు గురయ్యారంటూ.. పిడుగురాళ్లలో వైసీపీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత వెళ్లారు. టీడీపీ శిబిరంలో ఉన్న వాళ్లందరూ పెయిడ్ ఆర్టిస్టులేనని ఆరోపణలు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించే అవకాశం లేదని నిర్ణయించుకుని.. టీడీపీ అధినేత.. 11వ తేదీన చలో ఆత్మకూరు కు పిలుపునిచ్చారు. బాధితుల్ని తీసుకుని గ్రామాలకు వెళ్లి.. వారిని ఆయా.. గ్రామాల్లో వదిలి పెట్టి.. భరోసా ఇచ్చి రావాలని నిర్ణయించుకున్నారు. మరో వైపు.. వైసీపీ దాడులకు గురైన బాధితులు.. కేంద్రహోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ దాడులతో గ్రామాల్లో ఉండలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు రక్షణ కల్పించడం లేదని ఆరోపించారు. దీంతో.. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ అంశంపై ఐజీ, డీజీపీలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

చలో ఆత్మకూరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటూండటం… బాధితులు కిషన్ రెడ్డిని కూడా కలిసి పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో… ఏపీ సర్కార్ లో కదలిక వచ్చింది. ఇప్పటి వరకూ చంద్రబాబు డిమాండ్ చేసినట్లుగా… బాధితుల శిబిరానికి వెళ్లాలనే ఆలోచన చేయని… పోలీసులు…. మనసు మార్చుకున్నారు. పోలీసు అధికారుల బృందం… వైసీపీ బాధితుల శిబిరానికి వెళ్తుందని… వారిని స్వగ్రామాలకు తీసుకు వెళ్లి… వారు శాంతిభద్రతలతో నివసించేలా… చూస్తారని.. హోంమంత్రి సుచరిత ప్రకటించారు. దాడులపై ఎక్కువగా ఫిర్యాదులొస్తున్నందున… పిడుగురాళ్లలో ఓ స్పెషల్ ఆఫీసర్‌ను కూడా నియమిస్తామని ప్రకటించారు. అయితే టీడీపీ మాత్రం వెనక్కి ఆలోచన చేయడం లేదు. పోలీసులు మాత్రం… పల్నాడు మొత్తం ఇప్పటి నుంచే 144 సెక్షన్ విధించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close