మండలి రద్దు కాదని క్లారిటీ..! అందుకే ఎమ్మెల్సీలపై గురి..?

వైసీపీ ఎమ్మెల్సీలను … పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మండలిని రద్దు చేయడానికి సిద్ధమైపోయి.. తీర్మానం ఢిల్లీకి పంపేసిన వైసీపీ.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దయిపోతుందని ఆశలు పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు భరోసా లభించిందని కూడా చెప్పుకున్నారు. కానీ అలాంటి సూచనలు రావడం లేదు. దీంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే.. శాసనమండలిలో ఫిరాయింపులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో.. వైసీపీ ఉన్నట్లుగా చెబుతున్నారు.

టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధరెడ్డిలు ఇప్పటికే వైసీపీకి మద్ధతు ప్రకటించారు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా అదే దారిలో ఉన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ కూడా అదే బాటలో ఉన్నారు. దీంతో మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడినట్లయింది. వీరుకాకుండా మరో ఐదుగురిపై వైసీపీ దృష్టి పెట్టింది. వారితో చర్చలు జరుపుతోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు టీడీపీని వీడేలా చూడాలని వైసీపీ భావిస్తోంది. టీడీపీకి శాసనమండలిలో బలం లేకుండా చేసి.. సెలెక్ట్ కమిటీకి పంపిన రెండు బిల్లులను వెనక్కి తెప్పించటంతోపాటు వాటిని ఆమోదింప చేయాలని వైసీపీ భావిస్తోంది.

శాసనమండలి రద్దు కోసం కనీసం ఏడాదిన్నర సమయం పడుతందని.. అప్పటికి వైసీపీకి మెజార్టీ వస్తుందని.. విశ్లేషణలు మొదటి నుంచి ఉన్నాయి. స్వయంగా జగన్ కూడా.. ఈ అంశాన్ని అంగీకరించారు. తమకు మెజార్టీ వస్తుందని తెలిసినప్పటికీ రద్దు చేస్తున్నామన్నారు. కానీ ఆయన . కేంద్రం.. తమ విజ్ఞప్తిని మన్నించి.. మండలిని రద్దు చేస్తుందని అనుకున్నారు. ఇప్పుడు అదే ఏడాదిన్నర ఖాయమని తేలుతూండటంతో.. ఫిరాయింపులకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. మరో ఏడాదిన్నర తర్వాతైనా.. శాసనమండలి రద్దు అవడం మాత్రం ఖాయమని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close