ఇప్పటి వరకూ నా మంచితనం చూశారు.. ఇక నుంచి అసలు సినిమా చూపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలు వేస్తున్న రౌడీ వేషాల గురించి మాట్లాడారు. తర్వాత అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి….సంబంధం లేని అంశాలతో చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎందుకంటే చంద్రబాబు అలా అంటారు కానీ అందర్నీ దయతో చూస్తారని.. తప్పులు చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోరని వారి నమ్మకం. అందుకే ఆయన హెచ్చరికల్ని వారు చాలా లైట్ తీసుకుంటున్నారు. చివరికి టీడీపీ నేతలు కూడా నమ్మలేకపోతున్నారు.
మాటలతో ఇప్పుడు ఎవరూ భయపడరు !
వైసీపీ నేతలు రాష్ట్రంలో అలజడి రేపే ప్రయత్నాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. జగన్ రెడ్డి ప్రతి ప్రాంతానికి రౌడీలతో వెళ్లి అలజడి రేపుతున్నారు. ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన పర్యటనలో రౌడీషీటర్లే ఎక్కువగా ఉంటున్నారు. వారు ఇతరులపై దాడులు చేస్తున్నారు. ఎంత సైకోయిజం అంటే ఇంట్లో శుభకార్యానికి వెళ్లినా.. కొంత మందిని పోగేసి.. పిల్లవాడి సైకిల్పై ప్రతాపం చూపించేంత సైకోయిజం వారిలో ఉంది. వారికి బుద్ధి చెప్పడానికి,భయం వచ్చేలా చేయడానికి ఇప్పటి వరకూ సరైన చర్యలు లేవు.
సంఘ విద్రహోశక్తులకు యోగి మార్క్ ట్రీట్మెంట్
యూపీలో ఒకప్పుడు నేరస్తుల రాజ్యం ఉండేది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను ఆయన వదిలి పెట్టలేదు. రికార్డు స్థాయి ఎన్ కౌంటర్లు జరిగాయి. గ్యాంగ్ స్టర్లు అని చెప్పుకోవడానికి అంతా భయపడిపోతున్నారు. ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో ప్రశాంతత ఉంది. దోపిడీలు, దొంగతనాలు లేవు. రాజకీయ నేతలు నేర రాజకీయాల మీద ఆధారపడటం తగ్గించారు. ఆ స్థాయిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు లేకపోవచ్చు కానీ నిర్లక్ష్యం చేస్తే.. అంతే పెరిగిపోతాయి. వైసీపీ అధినేత ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టమవుతోంది. యోగి ఫార్ములాను చంద్రబాబు వర్కవుట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
వ్యవస్థను భయపెట్టాలనుకోవడమే జగన్ ప్లాన్
అధికారం లేకపోయినా భయపెట్టి తన రాజకీయం చేయాలని జగన్ రెడ్డి అనుకుంటున్నారు. అందుకే ఆయన తరచూ బెదిరింపులకు దిగడమే కాదు.. సంఘ విద్రోహశక్తులతో బలప్రదర్శనలు చేస్తున్నారు. ఈ వ్యూహాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుని కఠినంగా అణిచి వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. చెవిరెడ్డి లాంటి వాళ్లు పోలీసులపై జులుం ప్రదర్శిస్తూంటే.. చూస్తూ ఊరుకుంటే ఇతరులకూ ధైర్యం వస్తుంది. అలాంటివి మొదట్లోనే .. అణిచివేస్తే.. ప్రతి ఒక్కరికీ భయం వస్తుంది. కింది స్థాయి అరాచక శక్తుల్ని అణిచివేయడం కంటే.. వారి లీడర్లకు శంకరగిరి మాన్యాలు పట్టిస్తే.. కానీ వారి గణంలో భయం పుట్టదు. చంద్రబాబు ఇప్పుడు చేయాల్సింది అదే.