సాక్షికి బిల్లులు చెల్లించని వాలంటీర్లు !

వాలంటీర్లందరికీ ఇటీవల ప్రభుత్వం రూ. రెండు వందల జీతం పెంచింది. ఎందుంటే ఆ డబ్బులతో న్యూస్ పేపర్ కొనుక్కుని చదవడానికి. చదువుతారో లేదో కానీ.. కొనాలి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులిస్తోంది. ఏ పేపరో కొంటే ఊరుకుంటారా సాక్షి పేపరే కొనాలి. ఇలా డబ్బులు ఇస్తున్న వారందరి లిస్ట్ పేపర్ ఏజెంట్లకు పంపి వారికి పేపర్ వేయిస్తున్నారు. అయితే చాలామంది వాలంటీర్లు పేపర్ బిల్లు కట్టడం మానేశారు. ఆ డబ్బులు కూడా తామే వాడుకోవడం ప్రారంభించారు. దీంతో సాక్షి ఏజెంట్లకు పెద్ద చిక్కొచ్చి పడింది.

ప్రజాధనాన్ని సాక్షికి దోచి పెట్టడానికి ప్రభుత్వం ఎంచుకున్న అనేక మార్గాల్లో సాక్షి చందాను వాలంటీర్లతో కట్టించడం ఒకటి. వాలంటీర్లు డబ్బులిచ్చి కొనరు కాబట్టి.. వారికి ప్రభుత్వం రెండు వందలు ఇచ్చి సాక్షిని కొనిపిస్తున్నారు. అలా కొన్ని లక్షల సర్క్యూలేషన్ పెంచుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి దాంట్లోనూ రెండు సాక్షి పత్రికలు వేయిస్తూ మరింత పెంచుకున్నారు. ఆ డబ్బులు కూడా జనానివే. ఇక సాక్షి పత్రికకు వెళ్తున్న ప్రకటనలు వందల కోట్లే. అందరికీ బిల్లులు ఆగుతాయి కానీ.. సాక్షి పత్రికకు మాత్రం ఆగవు. ఇక సాక్షి ఉద్యోగుల్ని.. ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చి జీతాలిస్తున్న విషయం కళ్ల ముందే ఉంది.

అయితే వీరి దోపిడికి తాము సహకరిస్తున్నామని వాలంటీర్లు అనుకుంటున్నారేమో కానీ.. ఎక్కువ మంది ఆ సాక్షి పత్రిక వద్దని అంటున్నారు. అధికారికం కాదు కాబట్టి.. వాలంటీర్లు బలవంతంగా వేస్తే బిల్లు కట్టడం లేదు. దీంతో అధికారుల వైపు నుంచి సాక్షి ఏజెంట్లు ఒత్తిడి తెస్తున్నారు. బిల్లులు కట్టకపోతే జీతం కట్ చేస్తామని వాలంటీర్లను బెదిరిస్తున్నారు. పలు చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close