దేశమంతటా ‘యోగా డే’ ఫీవర్!

హైదరాబాద్: రేపు తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగ పేరు మార్మోగిపోతోంది. వాడవాడలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేటు సంస్థలు ఈ కార్యక్రమాలకోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. విద్యాసంస్థలలో అయితే ఇక చెప్పనవసరంలేదు. గత కొద్దిరోజులుగా ఈ కార్యక్రమంకోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయంమేరకు భారత్‌తోసహా 192 దేశాలలోకూడా ఈ యోగా డే జరగబోతోంది. ఈ నిర్ణయంవెనక ప్రధానమంత్రి నరేంద్ర మోడి కృషి, చొరవ ఎంతో ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశంలో ఆయన యోగాకు ఉన్న శక్తిని, ప్రాధాన్యతను నొక్కిచెబుతూ వర్తమాన ప్రపంచానికి దాని అవసరం ఎంతో ఉందని గుర్తుచేశారు. ఆయన వాదనను పరిగణనలోకి తీసుకున్న ఐరాస జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది.

ఐరాస నిర్ణయాన్ని, దానివెనక తమ ప్రభుత్వ కృషిని తెలియజెప్పడంకోసం ఈ కార్యక్రమాన్ని  ఘనంగా జరపాలని మోడి నిర్ణయించారు. కొద్ది ప్రాంతాలు తప్పితే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగబోతోంది. ప్రపంచ రికార్డులను తిరగరాసేటట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఒక్క ఢిల్లీలోనే రాజ్‌పథ్‌లోనూ, ఇండియాగేట్ పరిసరాలలోనూ 37వేలమంది పాల్గొనబోతున్నారు. ఇక అంతర్జాతీయ సముద్రజలాలలో ఉన్న యుద్ధనౌకలమీద, సియాచిన్ పర్వత పాదాల చెంతనా సైనికులు ఆసనాలు వేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 191 దేశాలలోనూ భారత దౌత్యకార్యాలయాలు ఆయా చోట్ల ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించబోతున్నాయి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో 30వేలమందితో జరిగే కార్యక్రమానికి సుష్మా స్వరాజ్ హాజరవుతున్నారు. కొన్ని వర్గాలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో రేపు వేసే ఆసనాలనుంచి సూర్యనమస్కారాలను ఉపసంహరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close