కోడి కత్తి కేసు ని కూడా పరిష్కరించ లేక పోయిన వంద రోజుల పాలన అంటూ సెటైర్స్

జగన్ పాలన వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆ పాలన పై అటు వైకాపా తరపున పాజిటివ్ విశ్లేషణలు, ఇటు విపక్షాల నుండి నెగెటివ్ విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే, జగన్ మీద జరిగిన దాడి కేసులో, బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతి లేకపోవడం మీద పలు సందేహాలు విపక్షాల నుండి మాత్రమే కాక సామాన్య ప్రజల నుండి కూడా వినిపిస్తున్నాయి.

ఇదే విషయంపై సెటైర్స్ వేశారు మాజీ మంత్రి నారా లోకేష్. లోకేష్ ట్వీట్ చేస్తూ, ” కోడి కత్తి వెనుక మహాకుట్ర ఉంది, సీబీఐ విచారణ చేపట్టాలని టీవీల్లో అరిచిన గ్యాంగ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? నిందితుడు జైల్లోనే ప్రాణహాని ఉంది అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? సీబీఐకి కేసు అప్పగిస్తే నిజాలు బయటపడి జీవితాంతం శుక్రవారం కోర్టుకి వెళ్లాల్సివస్తుందని భయమా?” అని వ్రాసుకొచ్చారు. ప్రజల లో కూడా, అప్పట్లో జగన్, మరియు ఇతర వైకాపా నాయకులు ఆరోపించినట్లు, నిజం గా ఇది అప్పటి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నేత లు పని అయి ఉంటే, స్వయం గా తన మీద జరిగిన దాడి కేసులో జగన్ వంద రోజుల పాలన లో ఖచ్చితంగా పురోగతి ఉండేదనే అభిప్రాయం ఏర్పడింది.

మరి జగన్ పాలన పూర్తి అయ్యేలోపు అయినా ఈ కత్తి దాడి కేసులో పురోగతి ఉంటుందా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close