అదానీకి మధురవాడలో 130 ఎకరాలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కు ఏర్పాటుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సుల మేరకు డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కు, నైపుణ్యాభివృద్ధి వర్సిటీ.. నిర్మాణాలకు మధురవాడలో 130 ఎకరాలు కేటాయించారు. భూమి ఇచ్చిన మూడేళ్లలోపు కార్యకలాపాలు ప్రారంభించాలని షరతు విధించారు. అలాగే ఏడేళ్లలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కుకు.. 20 ఏళ్లపాటు విద్యుత్ ప్రోత్సాహకాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశఆరు. డేటా సెంటర్‌కు ఇచ్చిన భూమిలో నివాసాలు ఉండొద్దని స్పష్టం చేసింది. నిజానికి గత ప్రభుత్వంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ డేటా సెంటర్ కోసం ఒప్పందంచేసుకుంది.

రూ .70 వేల కోట్ల పెట్టుబడి పెడుతూ..అదానీ డేటా సెంటర్‌, టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా శంకుస్థాపన కూడా జరిగింది. అయితే ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే విశాఖలో గత ప్రభుత్వం తీసుకు వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలన్నింటినీ నిలిపివేసింది. లూలూగ్రూప్ కూడా వెళ్లిపోయింది. శంకుస్థాపన జరిగినప్పటికీ అదానీ డేటాసెంటర్ కూడా.. వెనుకడుగు వేసింది. మరో కంపెనీతో కలిసి హైదరాబాద్‌లో డేటా సెంటర్ పెడుతుున్నట్లుగాప్రకటించింది. అయితే అధికారికంగా తాము ఏపీలో పెట్టుబడులు ఉపసంహరించుకున్నమని ప్రకటించలేదు.

కానీ రెండేళ్లుగా ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ లోపు కాపులుప్పాడలో అదానీకి కేటాయించిన భూముల్ని ప్రభుత్వం వెనక్కితీసుకుంది. ఇప్పుడు నేరుగా మధురవాడలోనే 130 ఎకరాలు కేటాయించింది. అనేక రాయితీలు ఇచ్చింది. అయితే.. అదానీ గ్రూప్ నుంచి మాత్రం ఇంత వరకూ అధికారికంగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లుగా ప్రకటన రాలేదు. గత కేబినెట్ భేటీలో భూముల కేటాయింపు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి అహ్మదాబాద్ వెళ్లి అదానీని కలిసినట్లుగా ఫోటోలు బయటకు వచ్చాయి.కానీ ఆ కంపెనీ నుంచి మాత్రం అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close