అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. జూన్ 9వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయవాది ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు.
నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్రెడ్డి ఏ4గా ఉన్నారు. అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు చేపట్టడం, దాన్ని తరలించడం, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించడం, అడ్డుకున్న గిరిజనులను బెదిరించడం వంటి పలు తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
ఈ కేసులో ఆయన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. దాదాపు 55 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను ఆదివారం సాయంత్రం బెంగళూరు సమీపంలోని ఒక రిసార్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన వెంకటగిరి కోర్టులో హాజరు పరచగా జూన్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించింది.