అత‌డు వ‌చ్చి.. ప‌దిహేనేళ్లు!

అత‌డు.. ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ స‌త్తా చెప్పిన చిత్ర‌మ్‌. మ‌హేష్ స్టైలీష్ న‌ట‌న‌ని చూపించిన సినిమా. మేకింగ్‌లో.. కొత్త పుంత‌లు తొక్కించిన సినిమా. ఇప్ప‌టికీ.. ఆ సినిమా గురించి మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. టీవీల్లో ఎన్నిసార్లు వ‌చ్చినా చూస్తూనే ఉంటారు. అందులోని డైలాగుల‌న్నీ… సినీ అభిమానుల‌కు కంఠ‌తా వ‌చ్చు. అందుకే… అదో క్లాసిక్ అయ్యింది. ఈ సినిమా విడుద‌లై నేటికి… 15 ఏళ్లు.

నిజానికి ఈ క‌థ మ‌హేష్‌కోసం రాసుకున్న‌ది కాదు. అంత‌కు ముందే.. ఈ సినిమా క‌థ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కి వినిపించాడు త్రివిక్ర‌మ్. క‌థ చెబుతున‌ప్పుడు ప‌వ‌న్ నిద్ర‌పోయాడ‌ట కూడా. అందుకే.. ప‌వ‌న్‌తో తీయాల్సిన `అత‌డు`… మ‌హేష్ చేతికి వెళ్లింది.

అత‌డుని ఇప్పుడంటే క్లాసిక్ అనుకుంటున్నాం గానీ, విడుద‌లైన‌ప్పుడు జ‌నాల‌కు పెద్ద‌గా ఎక్క‌లేదు. వ‌సూళ్లు బాగాన్నా, బ్రేక్ ఈవెన్ రావ‌డం క‌ష్ట‌మైంది. కానీ టీవీల్లోకి వ‌చ్చాక మాత్రం.. చూసిన సినిమానే మ‌ళ్లీ చూడ‌డం మొద‌లెట్టారు. `మా` టీవీలో ఎప్పుడొచ్చినా ఈ సినిమాకి రేటింగ్స్ అదిరిపోతుంటాయి. “అత‌డు సినిమా టీవీల్లో చూశాక‌.. క్లాసిక్ అన్నారు. థియేట‌ర్లోనూ ఆ రేంజులో జ‌నం చూస్తే బాగుండేది“ అని త్రివిక్ర‌మ్ అప్పుడ‌ప్పుడూ బాధ‌ప‌డుతుంటారు. కాక‌పోతే.. ఓవ‌ర్సీస్‌లో త్రివిక్ర‌మ్ సినిమాల‌కు మంచి పునాది వేసిన సినిమా ఇది. అప్ప‌టి నుంచీ.. త్రివిక్ర‌మ్ సినిమా అంటే… ఓవ‌ర్సీస్‌లో మంచి రేట్లు ప‌ల‌క‌డం ప్రారంభ‌మైంది.

వార‌సుడొచ్చాడు సినిమా క‌థ‌కీ.. అత‌డుకీ ద‌గ్గ‌ర పోలిక‌లు ఉంటాయి. మ‌ధుబాబు రాసిన షాడో లో కొన్ని స‌న్నివేశాల స్ఫూర్తితో.. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ రాసుకున్నాడు త్రివిక్ర‌మ్‌. అందుకోసం త్రివిక్ర‌మ్ మ‌ధుబాబుని క‌లిసి ఆయ‌న అనుమ‌తి కూడా తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

రెడ్డి గారి “మేఘా” క్విడ్ ప్రో కో !

1989లో సిమెంట్ పైపులు తయారు చేసే కంపెనీ మేఘా ఎంటర్ ప్రైజేస్. పి. పిచ్చిరెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీ రాజకీయ పార్టీలకు రెండున్నర...

దానంపై అనర్హతా వేటుకు బీఆర్ఎస్‌ ఫిర్యాదు – పాతవన్నీ గుర్తుకు రావా ?

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి...

రోజాను బూతులు తిట్టిన బండారుకు వైసీపీ ఎంపీ టిక్కెట్ ?

వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీగా హ్యాండిచ్చినట్లుగా స్పష్టమయింది. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close