” ఈశ్వరయ్య టేపు ” తీగ లాగితే మొద్దు శీను హత్య వరకూ వెళ్తోందేంటి..?

మొద్దు శీనును జైలు బయట హత్య చేసి ఓం ప్రకాష్ ఉన్న బ్యారక్ లోపల వేశారా..? . అవుననే అంటున్నారు.. అప్పట్లో… మొద్దు శీను హత్యకు గురైన సమయంలో న్యాయమూర్తిగా ఉన్న రామకృష్ణ. ఆయన ప్రస్తుతం… ఈశ్వరయ్య టేపుల వివాదంలో.. కీలకంగా ఉన్నారు. దళితుడైన రామకృష్ణ… జస్టిస్ నరసింహారెడ్డిపై అభిశంసన ప్రక్రియకు ఫిర్యాదు చేసి.. సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన వివిద కారణాలతో సస్పెండ్ అయ్యారు. ఎనిమిదేళ్ల నుంచి ఆయనకు పోస్టింగ్ లేదు. తాజాగా.. ఆయనను ఈశ్వరయ్య బుజ్జగించి.. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయించేందుకు ప్రొత్సహించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆడియో టేపును కోర్టుకు సమర్పించిన రామకృష్ణ.. రోజుకో కొత్త విషయం బయట పెడుతున్నారు.

అప్పట్లో మొద్దు శీనును జైల్లో తాను రామకోటి రాసుకుంటూండగా.. డిస్టర్బ్ చేశాడని.. డంబెల్స్‌తో కొట్టి చంపానని ఓంప్రకాష్ ఒప్పుకున్నట్లుగా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అప్పట్లో.. న్యాయమూర్తిగా ఉన్న రామకృష్ణ ఎదుటే.. ఓం ప్రకాష్‌ను హాజరు పరిచారు. అప్పుడే .. మొద్దు శీను హత్యతో తనకేం సంబంధం లేదని… విలపించారని.. మొద్దు శీనును బయట చంపేసి.. బ్యారక్‌లో పడేశారని.. చెప్పారని.. తాను తన రిపోర్ట్‌లో అదే చెప్పానని రామకృష్ణ చెబుతున్నారు. ఇంతటితో ఆగిపోలేదు.. ఆయన… ఈశ్వరయ్య ప్రస్తావన తీసుకు వచ్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత… కేసును తప్పుదోవ పట్టించేందుకు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఈశ్వరయ్య.. అనంతపురం జిల్లా జిల్లా జడ్జిని కలిశారని రామకృష్ణ ఆరోపిస్తున్నారు. ఈ కేసును ఆయన ప్రభావితం చేశారని అంటున్నారు.

మొద్దు శీను హత్య కేసును మళ్లీ విచారించాలని.. రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పోస్టింగ్ లేని రామకృష్ణ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. రోజుకో కొత్త విషయాన్ని బయట పెడుతున్నారు. ఈశ్వరయ్య అంశాన్ని హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు కొత్తగా మొద్దు శీనును బయటే చంపేసి.. బ్యారక్‌లో తీసుకొచ్చి పడేశారనే అంశాన్ని కూడా వెలుగులోకి తెచ్చారు. ముందు ముందు ఇంకెన్ని విషయాలు బయటపెడతారో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close