ఈ గ్రేట్ విజయం ఎవరిది కేసీఆర్? కె.టి.ఆర్.?

గ్రేటర్ ఎన్నికలలో తెరాస పార్టీ తిరుగులేని విజయం సాధించి మళ్ళీ తన సత్తా చాటుకొంది. అయితే ఈ ఎన్నికలను తెరాస గెలుపుగా కంటే ప్రతిపక్షాల ఓటమిగానే ఎక్కువగా చూడవలసి ఉంటుంది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో ఎంతో బలం ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెదేపా, బీజేపీలు చాలా ఘోరంగా ఓడిపోయాయి. ఒకవిధంగా చెప్పాలంటే తెరాస అధినేత కేసీఆర్ వ్యూహాలకి అవి చిత్తు చిత్తుగా ఓడిపోయాయని చెప్పక తప్పదు

ఇంకా మరొక ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే, కె.టి.ఆర్.ని తన రాజకీయ వారసుడిగా చేయాలనుకొంటున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ఎన్నికలను చాలా చక్కగా ఉపయోగించుకొంటూ కొడుకు కోసం చాలా చక్కటి వ్యూహం అమలు చేసారని చెప్పవచ్చును.

జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాస అసలు ఎన్నడూ గెలిచే అవకాశమే లేదని దాదాపు అందరూ నిర్ధారించేసినపుడు, ఆయన ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా సుమారు ఏడాదికి పైగా సకల ఏర్పాట్లు చేసి, ఈ ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తామనే పూర్తి నమ్మకం ఏర్పడిన తరువాతనే తను పక్కకు తప్పుకొని తన కొడుకు కె.టి.ఆర్.కి ఈ ఎన్నికల బాధ్యతని పూర్తిగా అప్పగించేరు. అంటే బంగారు పళ్ళెంలో విజయాన్ని పెట్టి కొడుకుకి అందించినట్లు చెప్పవచ్చును. దానిని కె.టి.ఆర్. కూడా చాలా చక్కగా అందిపుచ్చుకొని, మరి కొంత కృషి చేసి ఊహించిన దానికంటే పార్టీకి ఘన విజయం దక్కేలా చేయగలిగారు. ఇది చాలా చక్కటి దీర్ఘకాలిక వ్యూహమని చెప్పవచ్చును.

ఈ విజయంతో కేసీఆర్ ఒకే దెబ్బకి మూడు పిట్టలు కొట్టినట్లయింది. 1. గ్రేటర్ పీఠం దక్కించుకొని ప్రతిపక్షాల విమర్శలకు గట్టిగా జవాబు చెప్పడం. 2. తన కొడుకు కె.టి.ఆర్.ని పార్టీలో తిరుగులేని నేతగా ప్రతిష్టించడం.3. గ్రేటర్ పరిధిలో ఆంధ్రా ప్రజలు సైతం ఇప్పుడు తెరాసని ఆదరిస్తున్నారని రుజువు చేయడం.

ఈ తిరుగులేని విజయంతో తెలంగాణాలో ప్రజలు అందరూ తెరాస చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆమోదిస్తున్నట్లు కూడా రుజువయింది.
అయితే ఈ విజయం కోసం కేసీఆర్ చేసిన కృషి అంతా సవ్యమయినదేనని చెప్పడానికి కూడా లేదు. “యుద్ధంలో గెలవడం ముఖ్యం కానీ ఎలాగ గెలిచామన్నది ముఖ్యం కాదనే విధానం” కేసీఆర్ ది. అందుకే గత ఏడాదిగా గ్రేటర్ పరిధిలో అనేక డివిజన్లను తెరాసకు అనుకూలంగా పునర్విభజన చేయడం, జాబితా సవరణ పేరిట అనేకమంది ఆంధ్రా ఓటర్ల పేర్ల తొలగింపు, ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలను కార్యకర్తలను ‘ఆపరేషన్ ఆకర్ష’ ద్వారా పార్టీలోకి ఆకర్షించి వాటిని బలహీనపరిచి, మానసికంగా దెబ్బ తీయడం, ఎన్నికలకు చాలా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసేసుకొని ప్రతిపక్షాలకు ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను కుదించడం వంటివి అనేక వికృత ఆలోచనలు, వ్యూహాలు కనబడుతున్నాయి.

ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, చివరికి ఆ పార్టీల అభ్యర్ధులను కూడా నయాన్నో భయాన్నో లొంగదీసుకొని తెరాసలోకి ఆకర్షించుతుండటం వలన, ఇక ఏ పార్టీకి ఓటేసిన చివరికి అందరూ తెరాసలోనే జేరుతారనే అభిప్రాయం ప్రజలకి కలిగేలా చేయగలగడం కూడా తెరాస విజయానికి గల కారణాలలో ఒకటని చెప్పుకోవచ్చును. ఈ బారీ విజయం తరువాత ప్రతిపక్షాల నుండి తెరాసలోకి బారీగా వలసలు మొదలవవచ్చును. అది తెరాస మరింత బలపడటానికి, ప్రతిపక్షాలు నిర్వీర్యం అవడానికి దోహదపడవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close