మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సిఫార్సుచేయడంతో కేంద్రం అంగీకారం తెలిపింది. కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలని ప్రభుత్వం కోరింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకూ సీఎస్‌ సర్వీస్‌లో కొనసాగనున్నారు. కేంద్రం…ఇటీవలి కాలంలో ఉన్నతాధికారుల సర్వీస్ పొడిగింపును ఆమోదించడం లేదు.

గతంలో టీడీపీ హయాంలో… అజేయకల్లాం చాలా కొద్ది రోజులు మాత్రమే.. సీఎస్‌గా ఉన్నారు. ఆయన పదవి కాలాన్ని పొడిగించాలని అప్పటి చంద్రబాబు సర్కార్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ అసంతృప్తితోనే ఆయన…పదవి విరమణ తర్వాత చంద్రబాబుకు వ్యతిరేకమయ్యారన్న ప్రచారం ఉంది. అయితే ప్రస్తుతం..కరోనా వైరస్ చర్యలు కీలకం అయినందున… ఈ విధుల్లో పాల్గొంటున్న వారి సర్వీసును కేంద్రం పొడిగిస్తోంది.

ఈ జాబితాలో.. నీలం సహానికి కూడా అవకాశం లభించిందనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నీలం సహాని సీఎస్‌గా.. ఒత్తిడిగా ఎదుర్కొంటున్నారు. రంగుల జీవోల విషయంలో ఇప్పటికే కోర్టు ధిక్కరణ విచారణ ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అదే సమయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. ఇచ్చిన పలు ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటి సమయంలో సీఎస్ పొడిగింపు కోరుకోవడం.. ప్రభుత్వం ఆమోదించడం అధికార వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close