ఏపీలో సామాజికవ్యాప్తి..! ఒక్క రోజులో 3963 పాజిటివ్ కేసులు..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజులో.. 3963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు.. మరణాలు .. 52 నమోదయ్యాయి. 23, 872 శాంపిల్స్ పరీక్షిస్తే అందులో దాదాపుగా నాలుగు వేల మందికి పాజిటివ్ వచ్చింది. ఈ అంకెలు అధికారవర్గాలను సైతం భయ పెడుతున్నాయి. జిల్లాల్లో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క రోజే.. 994 కేసులు నమోదవడం… తీవ్రతకు అద్దం పడుతోంది. కర్నూలు జిల్లాలో 550 కేసులు నమోదయ్యాయి. ప్రతీ జిల్లాలోనూ కనీసం వంద కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తే.. ఏపీలో సామాజిక వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందన్న అభిప్రాయం.. వైద్య వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ.. ఏపీలో ఉన్న వారివే. వలస కార్మికులవి.. విదేశాల నుంచి వచ్చిన వారివి కాదు. మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూండటంతో… వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని.. ఆక్సీజన్ యూనిట్లు.. వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. ఇవన్నీ.. మరణాల రేటును తగ్గించలేకపోతున్నాయి. గత వారం రోజుల నుంచి రోజుకు.. 40కిపైగా మరణాలు నమోదయ్యేవి.. ఇప్పుడు అవి యాభై దాటిపోయాయి. మరణాలు రేటు.. చాలా ఎక్కువగా ఉండటం కూడా.. అధికార వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.

నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిహద్దులను.. మూసి వేసింది. పాస్‌లు ఉండి.. పక్కాగా పరీక్షలు చేయించుకున్న వారినే అనుమతిస్తోంది. అయితే అలా వస్తున్న వారి కన్నా… అంతర్గతంగానే వైరస్ పాకిపోతోంది. చాలా చోట్ల.. కట్టడి ప్రాంతాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీలైనంత వరకు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ.. కేసులు మాత్రం ఆగడం లేదు. పైగా.. పల్లె ప్రాంతాల్లో వైరస్ విజృంభిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో.. దేశంలో ఇతర చోట్ల వైరస్ విస్తరిస్తూంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పల్లె ప్రాంతాల్లో విశ్వరూపం ప్రదర్శిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

పాతబస్తీలో తగ్గిన పోలింగ్… టెన్షన్ లో అసద్..!?

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close