ఏపీలో ” ఫైవ్ పర్సంట్ ” రూల్..! ఇక అందరికీ వర్తింపు ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలన్నీ రహస్యంగా ఉంచుతోంది కాబట్టి ఇలాంటి చిత్రవిచిత్రాలు ఎన్ని ఉంటున్నాయో కానీ కొన్ని బయటకురాక తప్పదు. అలా వచ్చిన కొత్త జీవో ప్రకారం.. ఇక నుంచి ఏపీలో ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నా ఐదు శాతం జగనన్న కాలనీలకు చందా ఇచ్చుకోవాల్సిందే. అది స్థలం రూపంలో అయినా కావొచ్చు.. డబ్బు రూపంలో అయినా కావొచ్చు. అది ఇచ్చే వాళ్ల ఇష్టం.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసే ప్రైవేటు వెంచర్లలో ఐదు శాతం జగనన్న కాలనీలకు ఇవ్వాలనేది ప్రభుత్వ తాజా నిర్ణయం. అయితే ఆ వెంచర్లలోనే ఇవ్వాలనేం లేదు. కాస్త దూరంగా అయినా ఇవ్వొచ్చు… లేదా డబ్బులు కూడా కట్టొచ్చు. ఈ నిర్ణయం చూసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా నిర్వేదానికి గురయ్యే పరిస్థితి వచ్చింది. రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే రోడ్లకు.. ఇతర అవసరాలకు స్థలం వదిలేయడమే కాకుండా.. పది శాతం సామాజిక అవసరాలకు ఆ వెంచర్‌కు వదిలి పెట్టారు. ఇప్పుడు అదనంగా మరో ఐదు శాతం అంటే.. ఇక ఎకరం స్థలంలో వెంచర్ వేస్తే అర ఎకరం కూడా అమ్ముకోవడానికి ఉండదు.

అయితే ఇలా ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాల్లో ప్రభుత్వ పథకానికి కొంత ఇవ్వాలని ఉత్తర్వులు ఇవ్వడం ఏ చట్టం ప్రకారం న్యాయబద్ధమో ఎవరికీ తెలియడం లేదు. తమకు అధికారం ఉంది కాబట్టి ఉత్తర్వులు ఇస్తాం.. ఇచ్చిన ప్రకారం చెల్లింపులు చేయాలన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముందు ముందు ప్రజల సంపాదనలో ప్రభుత్వ పథకాలకు కొంత మొత్తం ఇవ్వాలన్న నిబంధనలు కూడా తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. ఓటు బ్యాంక్‌కు పథకాలు అమలు చేయడానికి నిధులు సమకూర్చడం కోసం ఇలా ఇతర వర్గాల మీద దాడి జరుగుతోందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం అంటే పరిపాలన చేయాలి. అంతే కానీ.. ప్రతి అడుగులోనూ ప్రజల జీవితాల్ని ప్రభావితం చేయాలనుకోవడం.. చేస్తామని పట్టుదలకు పోవడం వింతే. ఇలాంటి వింత పోకడలకు ఏపీ ప్రభుత్వం పోతోంది. చట్టాలను.. రాజ్యాంగాలను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close