“అన్నమయ్య”పై కదిలిన కేంద్రం.. రాష్ట్రం కవరింగ్ !

అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన విషాదం వెనుక తప్పిదం ఎవరిదో తేల్చి శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పిన కేంద్ర మంత్రి షెకావత్‌పై వైసీపీ నేతలు దారుణమైన విమర్శలు చేయడంతో బీజేపీ హైకమాండ్‌కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వెంటనే అన్నమయ్య ప్రాజెక్ట్ విషాదానికి కారణం ఏమిటో తేల్చేందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రికార్డులు పరిశీలించి.. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.

అన్నమయ్య ప్రాజెక్ట్ విషాదం వెనుక వ్యక్తుల స్వార్థం ఉందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇసుక మాఫియా కోసం నీరు దిగువకు విడుదల చేయలేదన్న వాదన ఉంది. అదే సమయంలో కేంద్రం నుంచి .. ఎంత ఎంత వర్షం పడుతుంది.. ఎగువ నుంచి ఎంత ఎంత వరద వస్తుందన్న దానిపై స్పష్టమైన సమాచారం ఉంది.అధికారలకు ఎప్పటికప్పుడు సమాచారం అందింది. దాని ప్రకారం నీటిని దిగువకు విడుదల చేయడంలో విఫలమయ్యారు. అదే సమయంలో పని చేయని ఐదో గేటు అంశం కూడా హాట్ టాపిక్ అవుతోంది. దానికి ఏడాది కిందటే మరమ్మతులు చేయాలని తేల్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇది కూడా ఘోర తప్పిదమే. ఇవన్నీ కేంద్ర బృందం వచ్చి పరిశీలన చేస్తే తేలిపోతాయి.

కేంద్ర బృందం వస్తే ఇరుక్కుపోతామని భావిస్తున్న ప్రభుత్వం హడావుడిగా రెండు కమిటీల్ని నియమించింది. ఒకటి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో.. మరొకటి సాంకేతిక ఉప కమిటీ. ఇప్పటి వరకూ ప్రభుత్వం నిర్మోహమాటంగా అది ప్రకృతి విపత్తే కానీ.. ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని చెబుతూ వస్తోంది. కానీ కేంద్రం కమిటీ నియమిస్తోందని తెలిసిన తర్వాత వెంటనే.. రెండు కమిటీల్ని నియమించింది. కేంద్ర కమిటీకి వీలైనంత వరకూ పరిమితులు పెట్టడమే ఈ కమిటీల నియామకం లక్ష్యమని భావిస్తున్నారు.

కొద్ది రోజులుగా అన్నమయ్య ప్రాజెక్ట్ విషాదంపై రాజకీయం నడుస్తోంది.తప్పిదం ఎవరిదో తేల్చాలన్న డిమాండ్లూ వినిపిస్తున్నాయి. కేంద్రం ఈ విషయంలో సీరియస్‌గా ఉంటే.. పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడానికి కారణమైన వారికి సరైన శిక్ష పడేఅవకాశం ఉంది. అదే జరిగితే .. మళ్లీ మళ్లీ ఇలాంటి తప్పు జరగకుండా ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close