రాజగోపాల్ రెడ్డి గెలిస్తే 500 రోజుల్లో 5000 కోట్ల అభివృద్ధి !

బీజేపీ నేతలకు ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించరు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కేంద్రం నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానంటూ ఈటల రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఇప్పటికీ ట్రోల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కూడా అంత కంటే పెద్ద మేనిఫెస్టో విడుదల చేశారు. గెలవగానే రూ.200 కోట్లతో రోడ్లు, చేనేత కార్మికులకు టెక్స్ టైల్ పార్కు, రూ. 25 కోట్లతో ఐటీఐ, ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం, మూసీ నీళ్లను ఎత్తి పోసే పథకం, వీధి వ్యాపారులకు రూ.10 వేల సాయం, చౌటుప్పల్లో ఈఎస్ఐ హాస్పిటల్, రూ. 100 కోట్లతో క్రీడా మైదానం , ఇంకా వాటర్ ట్యాంకులు , ఇతర అభివృద్ధి అంతా చేసేస్తారట.

ఇన్ని హామీలు ఎప్పట్లోపు అమలు చేస్తారంటే.. ఐదు అంటే ఐదు వందల రోజుల్లో అని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన పదవి కాలం ఉండేది ఏడాది మాత్రమే. అందులోనూ చివరి మూడు నెలలు ఎన్నికల సీజన్. నాలుగేళ్లుగా మునుగోడుకు రాజగోపాల్ రెడ్డినే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నాలుగేళ్లుగా ఆయన ఏమీ చేయలేదు. అయితే మరో ఏడాదిలోపే ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ అవసరాల కోసం రాజీనామా చేసి.. ఇంత కాలం ఏమీ చేయకుండా ఇప్పుడు అన్నీ చేసేస్తానని మేనిఫెస్టో రిలీజ్ చేశారు.

కేంద్రం పెద్దలతో మాట్లాడే ఈ హామీలు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలుకూడా నేరుగా అందవు. రాష్ట్రం ద్వారా అందాల్సిందే. అయితే బీజేపీ నేతలు మాత్రం ఎమ్మెల్యే అయినప్పటికీ నేరుగా కేంద్రం నుండి నిధులు తెస్తామని..టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా పర్వాలేదని అంటున్నారు. దీన్ని ప్రజలు నమ్మితే బీజేపీకి పండగే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close