ఈ తిప్పలన్నీ మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికేనా?

చండీయాగం దిగ్విజయంగా పూర్తి చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్పి దృష్టి కేంద్రీకరించినట్లున్నారు. ఇంతవరకు తమ పార్టీతో స్నేహంగా ఉంటున్న మజ్లీస్ పార్టీతో కూడా ఈ ఎన్నికలలో పొత్తులు పెట్టుకోకూడదని నిశ్చయించుకొన్నారు కనుక ముస్లిం ఓట్లకు గాలం వేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేప్పట్టినట్లున్నారు.

ఈరోజు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న చంచల్ గూడ జైలు, రేస్‌కోర్సులను వేరే ప్రాంతాలకు తరలించి అక్కడ ముస్లింల కోసం పాఠశాలలు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే వచ్చే ఏడాది జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం విద్యార్ధుల కోసం ఏకంగా 60 రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించాలని నిర్ణయించారు. ఈ పాఠశాలల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మైనార్టీ పాఠశాలలలో కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా భోధన జరగాలని నిర్ణయించారు. ఈ 60 పాఠశాలలలో బాలురకి, బాలికలకి చెరో 30 చొప్పున కేటాయించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ మైనార్టీ పాఠశాలలలో భోధన, భోధనేతర సిబ్బంది నియామకాల కోసం కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

కేసీఆర్ ఈ నిర్ణయాన్ని జి.హెచ్.ఎం.సి. ఎన్నికల తరువాత తీసుకొని ఉండి ఉంటే ఎవరూ ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేసేవారు కాదు. కానీ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ నిర్ణయాలు తీసుకొన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తే అసజహమేమీ కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close