గూడచర్యానికి పాల్పడిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్

భారతీయ వాయుసేనలో ఉద్యోగిగా పనిచేస్తున్న రంజీత్ అనే ఉద్యోగి గూడచర్యానికి పాల్పడుతున్నందుకు నిన్న డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు పంజాబ్ లోని భటిండా జిల్లాలో అరెస్ట్ చేసారు. కేరళకు చెందిన రంజీత్ వాయుసేనకు చెందిన రహస్యాలను పాకిస్తాన్ గూడచర్య సంస్థ ఐ.ఎస్.ఐ.కు అందజేస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించడంతో అతనిని క్రిందటి నెలే ఉద్యోగంలో నుంచి తొలగించారు.

ఇంటర్నెట్ లో పరిచయమయిన ఒక మహిళ అతనిని ఈ పనికి పురికొల్పిందని ప్రాధమిక విచారణలో తెలిసింది. వాయుసేనకు చెందిన రహస్య సమాచారాన్నిరంజీత్ ఆమెకు ఈ-మెయిల్స్, ఎస్.ఎమెస్. మెసేజుల ద్వారా పంపించేవాడు. కొన్ని రోజుల క్రితమే డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు జమ్మూలో సరిహద్దు భద్రతాదళాలకు చెందిన అబ్దుల్ రషీద్ అనే సైనికుడిని ఇవే కారణాలతో అరెస్ట్ చేసారు. అతని ద్వారా మహమ్మద్ ఖైఫతుల్లా అనే పాకిస్తానీ ఏజంటుని, మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. కానీ వారికీ రంజీత్ కి ఏదయినా సంబంధం ఉందా లేక అతనిని ఆ మహిళా ఏజెంట్ ఒక్కరే వేరేగా హ్యాండిల్ చేస్తోందా? అనే విషయాలు పోలీసుల విచారణలో కనుగొనవలసి ఉంది. పోలీసులు రంజీత్ ని అరెస్ట్ చేసి డిల్లీకి తరలించారు. త్వరలో కోర్టులో హాజరుపరుస్తారు.

ఒకవైపు భారత్-పాక్ ప్రధానులు చాలా ఆప్త మిత్రులులాగ వ్యవహరిస్తూ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపరిచే ప్రయత్నాలు చేస్తుంటే, పాక్ ఐ.ఎస్.ఐ.సంస్థ, భారత్ లో గూడచర్యానికి పాల్పడుతోంది. ఇటువంటి చర్యలే ఇరు దేశాల సంబంధాలు చెడిపోయేందుకు కారణం అవుతాయని పాక్ ప్రభుత్వానికి తెలియదనుకోవాలా? లేక తెలిసీ తెలియనట్లు నటిస్తోందా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close