చెన్నైలో ఏరియల్ సర్వేకి బయలుదేరిన ప్రధాని మోడి

భారీ వర్షాలతో అతలాకుతం అవుతున్న తమిళనాడు రాష్ట్రానికి కేంద్రం, ఇరుగుపొరుగు రాష్ట్రాలు, చిత్ర సీమ అందరూ బాసటగా నిలుస్తున్నారు. కేంద్రప్రభుత్వం తక్షణమే రూ.940 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితమే చెన్నై బయలుదేరారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు. గత నాలుగయిదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలలో మొత్తం 269 మంది మరణించినట్లు హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్ని విధాల సహాయ పడుతోందని, అవసరమయితే ఇంకా అదనపు సహాయం అందించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.

ప్రస్తుతం చెన్నైలో ఆర్మీ, నావికాదళం సహాయ చర్యలలో పాల్గొంటున్నాయి. ఎన్.డి.ఆర్.ఎఫ్.కు చెందిన 1200 మంది సిబ్బంది, 100 బోట్లు కూడా సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇంతవరకు సుమార్ 70,000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నై విమానాశ్రయంలో 1,500 మంది చిక్కుకొని పోయారు. విమానశ్రయం రన్ వే పై కూడా నీళ్ళు ప్రవహిస్తుండటంతో విమానాలు రద్దయ్యాయి. రైళ్ళు, బస్సులు ఇంతకు ముందే రద్దయ్యాయి. తమిళనాడుని ఆనుకొని ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో కురుస్తున్న భారీ వానల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం జరిగిందని రాజ్ నాద్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణ సహాయంగా రూ.330 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close