నేడు విజయవాడ దుర్గ గుడి ఫ్లై ఓవర్ కి శంఖుస్థాపన

ఇవ్వాళ్ళ ఉదయం 9 గంటలకు విజయవాడలోని కనకదుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి శంఖుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర బీజేపీ మంత్రులు మాణిక్యాల రావు, డా. కామినేని శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.115 కోట్లు కేటాయిస్తుంది. దీని నిర్మాణం ఏడాదిలోగానే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు తరలి వస్తున్నందున విజయవాడలో కనకదుర్గ గుడి వద్ద ట్రాఫిక్ ని వేరే మార్గాలలోకి పోలీసులు మళ్ళించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close