చేతులు జోడించి చెబుతున్నా, కాంగ్రెస్‌ను వీడను: దానం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా విషయంలో గత నాలుగైదు రోజులుగా గోడమీద పిల్లిలాగా డ్యాన్స్‌లు చేసిన దానం నాగేందర్ ఎట్టకేలకు ఒక నిర్ణయానికొచ్చారు. టీఆర్ఎస్‌లో చేరమని తనను అడిగిన మాట వాస్తవమేనని, కానీ కాంగ్రెస్ పార్టీని వీడబోనని ఇవాళ ఉదయం స్పష్టంగా చెప్పారు. పార్టీ మారతానంటూ పదే పదే తనను బాధపెట్టొద్దని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. పార్టీనుంచి పొమ్మనలేక పొగబెట్టిన మాట నిజమేనని అన్నారు. ఈ ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇంట్లో ఇతర నేతలతో చర్చల తర్వాత దానం విలేకరులతో మాట్లాడారు. చేతులు జోడించి చెబుతున్నానని, కాంగ్రెస్‌ను వీడనని అన్నారు. పార్టీ బలోపేతంకోసం కృషి చేస్తానని, జీహెచ్ఎంసీ ఎన్నికలపై రేపు సమావేశం అవుతున్నట్లు చెప్పారు. రేపటి సమావేశంలో చర్చించాల్సిన అంశాల కోసమే షబ్బీర్ ఇంట్లో భేటీ అయ్యామని అన్నారు. ఎన్నికల వ్యూహాన్ని రేపు ఖరారు చేస్తామని చెప్పారు.

టీఆర్ఎస్‌లో చేరే విషయంలో ఆ పార్టీ నాయకత్వానికి, దానం నాగేందర్‍‌కు పొసగక పోవటమే దానం తాజా నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. దానం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరదామని అనుకుంటే, కేసీఆర్ మాత్రం కేశవరావు సమక్షంలో చేరమని అన్నారట. దీనితో ఖిన్నుడైన దానం తన నిర్ణయాన్ని మార్చుకున్నారని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close