బీఫ్ ఫెస్టివల్ తో విద్యార్ధులకు ఒరిగిదేమిటి?

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘బీఫ్, పోర్క్ ఫెస్టివల్’ పేరిట మొదలయిన అనవసరమయిన వివాదాలలో చివరికి హైకోర్టు కూడా జోక్యం చేసుకోవలసివచ్చింది. ఉస్మానియా ప్రాంగణంలో ఎవరూ బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశించింది. తన ఆదేశాలను ఖచ్చితంగా అమలుచేయాలని పోలీసులను, ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పెడచెవినపెట్టి ఎవరయినా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినట్లయితే వారి అడ్మిషన్లను రద్దు చేస్తామని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ హెచ్చరించగా, అటువంటి విద్యార్ధులపై చట్టపరమయిన చర్యలు తీసుకొంటామని ఏ.సి.పి లక్ష్మినారాయణ హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను అమలుచేసేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బారీగా పోలీసులను కూడా మొహరించారు.

ఒకప్పుడు ఉస్మానియా విద్యార్ధులు తెలంగాణా సాధన కోసం పోరాడినప్పుడు అందరూ హర్షించారు. కానీ వారిప్పుడు ఇటువంటి అనవసరమయిన వివాదాలు సృష్టించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి గొడవల కారణంగా వారిపై విశ్వవిద్యాలయం కానీ పోలీసులు గానీ చర్యలు తీసుకొంటే చివరికి నష్టపోయేది విద్యార్ధులే. తెలంగాణా ఉద్యమాలలో పాల్గొన్న విద్యార్ధులు చాలా మంది పోలీసు కేసులలో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరగవలసి వచ్చింది. కానీ తెలంగాణా ప్రభుత్వం వారిపై కేసులను ఉపసంహరించుకోవడంతో వారి భవిష్యత్ బుగ్గిపాలు కాకుండా తప్పించుకోగలిగారు.కానీ ఇటువంటి గొడవలలో అరెస్టయినా, విద్యాలయం నుంచి సస్పెండ్ చేయబడినా వారిని ఆదుకొనేందుకు, ప్రభుత్వం లేదా ఏ రాజకీయ పార్టీ ముందుకు రాకపోవచ్చును. పైగా కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కలుగవచ్చును. కనుక తమను వెనక నుండి ప్రోత్సహించే రాజకీయ నేతల, పార్టీలకు విద్యార్ధులు తలొగ్గకుండా కేవలం చదువులపైనే తమ దృష్టిని కేంద్రీకరిస్తే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ్ దీప్ ఇంటర్యూలు : పవన్ జోష్, చంద్రబాబు విజన్ – జగన్ అహంకారం !

అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇండియాటుడే చానల్ హెడ్ రాజ్ దీప్ సర్దేశాయ్ ముగ్గురు ప్రధాన నేతల్ని... ఇంటర్యూ చేశారు. ఏపీకే వచ్చారు. ముగ్గురు ప్రధాన నేతల ఇంటర్యూలను...

సేమ్ బీఆర్ఎస్ లాగే వైసీపీకి ఓవైసీ సపోర్ట్ !

మాము కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేసుకుందామని అసదుద్దీన్ ఓవైసీ ముస్లిలు ఎక్కువగా ఉండే ఊళ్లన్నీ తిరిగారు. కేసీఆర్ సీఎం కాకపోతే.. కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టారు. కానీ ఒక్కరూ...

బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోన్న ధృవ్ రాతీ..!

ధృవ్ రాతీ... సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పొలిటికల్ బెసేడ్ వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు. మీడియా అంత గోది మీడియాగా మారిందన్న ఆరోపణలు వస్తోన్న వేళ ధృవ్ రాతీ...

ఓటేస్తున్నారా ? : ఓ సారి రోడ్ల వైపు చూడండి!

ఏదైనా ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే రోడ్లు, కరెంట్, నీరు వంటివి. ఏపీలో రూ. 43 వేల కోట్లతో రోడ్లేశామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close