20 కోట్లు అయినా ససేమీరా చేయనన్న ఎన్టీఆర్

సినిమా వసూళ్ల ప్రభావితం చూపుతున్న ఈ తరుణంలో స్టార్ హీరో అడిగినంత ఇచ్చి సినిమాలను చేస్తున్నారు దర్శక నిర్మాతలు. హీరోలకున్న క్రేజ్ ని క్యాష్ తో కొట్టి వారు సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో పారితోషికం ఎక్కువ తీసుకునే వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. మొన్నటిదాకా 15 కోట్లు తీసుకుంటున్న వీరు చేస్తున్న సినిమాలకు 5 కోట్లు పెంచారని తెలుస్తుంది.

కొద్దికాలంగా సరైన హిట్లు లేక కాస్త వెనుకపడ్డ ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో హిట్ కొట్టాడు. ఈమధ్య ఓ సినిమాకు భారీ పారితోషికం ఇస్తామని చెప్పి అవకాశం వచ్చినా కాదని చెప్పాడట. ఈ దీపావళికి తమిళంలో విడుదలైన ‘వేదళం’ సినిమా అజిత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాను తెలుగులో ఎన్టీఆర్ చేత చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట తమిళ సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నం. ముందు ఈ సినిమా చిరంజీవితో చేయిద్దామనుకుంటే ఆయన ఏం మాట్లాడకపోయేసరికి ఎన్టీఆర్ తో తప్పకుండా చేయాలని జూనియర్ కు 20 కోట్ల పారితోషికం ఇస్తానని అన్నాడట.

పారితోషికం బాగానే ఉన్నా సినిమా చేస్తే మళ్లీ ‘రాఖి’, ‘ఊసరవెల్లి’ లాంటి ఇమేజ్ వచ్చి పడుతుందని కాదన్నాడట. వేదళం దర్శకుడు శివ తెలుగులో కూడా మంచి సినిమాలే తీశాడు. ఇప్పుడు ఆయనే ఎన్టీఆర్ తో తెలుగులో వేదళం చేద్దామనుకుంటే ఎన్టీఆర్ ఏమో ససేమీరా అంటున్నాడట. మరి వేదళం కోసం అంత ఇస్తానన్న వద్దన్నఎన్టీఆర్ ని చూస్తుంటే తీసే సినిమాలన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడనిపిస్తుంది. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఆ సినిమా షూటింగ్ ని త్వరలో పూర్తి చేసుకుని త్వరలో హైదరాబాద్ చేరనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close